టీ20 ప్రపంచకప్లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్లో భారత్–పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన పోరు మరోసారి క్రికెట్ అభిమానులకు మర్చిపోలేని అనుభూతిని అందించింది. కోట్లాది మంది అభిమానుల అంచనాల మధ్య సాగిన ఈ కీలక మ్యాచ్లో భారత జట్టు 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఈ విజయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు. టీమిండియా అద్భుతంగా ఆడిందంటూ కితాబిచ్చారు.
Read Also: Shoaib Akhtar: PCB చైర్మన్పై మండిపడ్డ మాజీ ఫాస్ట్ బౌలర్
ప్రతి ఆటగాడు తమ పాత్రను పూర్తి చేసారు
ఫార్మాట్లు, వేదికలు, తేదీలు మారినా పాకిస్థాన్పై టీమిండియా గెలుపు మాత్రం స్థిరంగా ఉంటోందని పేర్కొన్నారు. టీమిండియాకు ఆయన అభినందనలు తెలియజేశారు.పాకిస్థాన్పై విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్పై ప్రశాంతంగా, ధైర్యంగా భారత జట్టు అద్భుత విజయం సాధించిందని అన్నారు.
టీ20 మ్యాచ్లలో పాకిస్థాన్పై భారత్ విజయాలు 8-1కి చేరుకోవడం గొప్ప విషయమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు.భారత జట్టు కలిసికట్టుగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. వారి ప్రదర్శన గర్వకారణమని పేర్కొన్నాడు. టీమిండియాలోని ప్రతి ఆటగాడు ప్రశాంతంగా, బలంగా తమ పాత్రను పూర్తి చేశారని ప్రశంసించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: