हिन्दी | Epaper

Terrorist Attack : శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు: రామ్మోహన్‌ నాయుడు

sumalatha chinthakayala
Terrorist Attack : శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు: రామ్మోహన్‌ నాయుడు

Terrorist Attack : జమ్మూకశ్మీర్‌లోని పర్యటకులపై జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రమంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక ప్రకటన చేశారు. పర్యటకుల భద్రత మేరకు వారి కోసం శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు ప్రత్యేక విమానాలు శ్రీనగర్‌ నుంచి ముంబయి, ఢిల్లీకి చేరుకుంటాయని.. ఈవిషయంపై మంగళవారం హోంమంత్రి అమిత్‌ షాతో మాట్లాడానని తెలిపారు.

  శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమాన

అవసరమైతే మరిన్ని విమానాలు

అవసరమైతే మరిన్ని విమానాలు నడపడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులోభాగంగా మంత్రి అన్ని విమానయాన ఆపరేటర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కష్ట సమయంలో ప్రయాణికులపై భారం పడకుండా.. సాధారణ స్థాయి ఛార్జీలను వసూలుచేయాలని విమానయాన సంస్థలను ఆదేశించారు. మరణించిన వ్యక్తుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు.

ఆంధ్రభవన్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు

జమ్మూలో ప్రస్తుత పరిస్థితుల గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడుతో రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. కశ్మీర్‌లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా తిరిగి రావడంలో సాయం చేయడానికి ఢిల్లీలోని ఆంధ్రభవన్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం వాసి, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడారు. మృతదేహాన్ని విమానంలో తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Read Also: పహల్గామ్ ఉగ్రదాడి.. తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870