हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

Vanipushpa
మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి కోసం తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు సిద్ధం అవుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శివ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు, ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పొన్నం ప్రభాకర్ ఆదేశం
మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్లే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు చేయాలన్నారు. బస్టాండ్ ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ మునిశేఖర్, సీటీఎం శ్రీధర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్పలు పాల్గొన్నారు.

మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు


780 ప్రత్యేక బస్సులు
వేములవాడకు 780 ప్రత్యేక బస్సులు ఇప్పటికే వేములవాడకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాల నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి మహాశివరాత్రి జాతరకు వేములవాడకు వచ్చే భక్తుల కోసం 780 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మహాశివరాత్రి జాతర జరగనుంది.
మహాశివరాత్రి మూడు రోజుల జాతర
కాగా, ఈ ఏడాది మరో వంద బస్సు సర్వీసును అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. మహాశివరాత్రి మూడు రోజుల జాతర కోసం దాదాపు లక్ష మంది భక్తులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. దీంతో, ఈ మేరకు బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870