हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో భారీగా తగ్గిన రొయ్యల ధరలు

Vanipushpa
Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో భారీగా తగ్గిన రొయ్యల ధరలు

భారత్‌పై అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగంపై కనిపిస్తోంది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా 27 శాతం సుంకాలు విధించింది. దీనివల్ల ఏపీలోని ఆక్వారంగం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రొయ్యల సాగు అధికంగా ఉండే భీమవరం ప్రాంతంలో కిలో రొయ్యల ధర 40 రూపాయలు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికాకు చేపలు, రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. తూర్పు గోదావరి జిల్లా మత్స్యశాఖ అధికారుల వివరాల ప్రకారం భారతదేశం నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికా 27% సుంకం విధించింది. ఇప్పటికే భారతదేశ రొయ్యలపై అమెరికా యాంటీ డంపింగ్‌ డ్యూటీతో పాటు, 5.7% కౌంటర్‌ వయలింగ్‌ సుంకం (సీవీడీ) వసూలు చేస్తోంది. ఈ సుంకాలన్నీ కలుపుకుంటే దాదాపు 35 శాతానికి పైగానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో భారీగా తగ్గిన రొయ్యల ధరలు

‘లక్షలో సగం పన్నులు, ఖర్చులకే’
తాజా సుంకాలను కలుపుకుంటే లక్ష రూపాయల విలువ చేసే రొయ్యలను ఎగుమతి చేయాలంటే ఇప్పుడు రూ.26,000 సుంకం చెల్లించాలి. యాంటీ డంపింగ్‌ డ్యూటీ, కౌంటర్‌ వయోలిన్‌ డ్యూటీ కూడా కలిపితే రూ.35 వేలకు పైగా కట్టాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి రవాణా, ప్యాకింగ్‌ ఖర్చులు అదనం. లక్ష రూపాయల్లో సగం ఈ పన్నులు, రవాణా ఖర్చులకే పోతోందని కొందరు రైతులు చెప్పారు.
”నేను ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు లక్షలు పెట్టుబడి పెట్టాను. తీరా సోమవారం రొయ్య పట్టిన తర్వాత మార్కెట్‌కి ఫోన్‌ చేస్తే వంద కౌంట్‌కి 40 రూపాయలు తగ్గిందని చెప్పారు. అదేమంటే అమెరికాలో తగ్గించారని చెప్పారు. అమెరికా సుంకం ప్రభావంతో గత వారం నుంచి రొయ్యల ధరలు తగ్గిపోయాయని రైతులు చెబుతుంటే మార్కెట్‌లో రొయ్యలు అమ్ముకునే చిరు వ్యాపారులు మాత్రం ధర తగ్గినా తమకు పెద్దగా బేరాలు లేవని అంటున్నారు.

READ ALSO: Donald Trump: చైనాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. 104%కి పెంపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870