हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Shashi Tharoor: అందరి చూపు పార్లమెంట్ చర్చల పైనే ..శశిథరూర్ మౌనంపై కొనసాగుతున్న ఉత్కంఠ

Sharanya
Shashi Tharoor: అందరి చూపు పార్లమెంట్ చర్చల పైనే ..శశిథరూర్ మౌనంపై కొనసాగుతున్న ఉత్కంఠ

నేటి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడి, తరవాత కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) పై లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చ జరగనుంది. ఈ చర్చలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత, ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) ఈ చర్చలో పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. గతంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఏర్పాటైన అఖిలపక్ష బృందాలకు శశిథరూర్ నాయకత్వం వహించారు. ఆ సమయంలో అమెరికా సహా పలు విదేశాల్లో భారత ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తూ ప్రచారం జరిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు శశిథరూర్ (Shashi Tharoor) ప్రవర్తనపై తీవ్రంగా విమర్శించారు. బీజేపీ లో చేరుతారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

శశిథరూర్  గైర్హాజరీపై వివిధ ఊహాగానాలు

కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చర్చలో పాల్గొనాలనుకునే ఎంపీలు తమ పేర్లను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) కార్యాలయానికి ముందుగానే సూచించాలి. అయితే, శశిథరూర్ (Shashi Tharoor) ఇప్పటివరకు అలాంటి అభ్యర్థనను పంపలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తిరువనంతపురం ఎంపీ అయిన థరూర్ ఈ కీలక చర్చను దాటవేస్తే పార్టీతో ఆయన విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. థరూర్ ప్రభుత్వ వైఖరిని, కాల్పుల విరమణను బహిరంగంగా సమర్థించడం, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న పార్టీలోని పలు వర్గాల ఆగ్రహానికి దారితీసినట్లు సమాచారం. కాగా త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 5 గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు శశిథరూర్ ఉండడం విదితమే.

శశిథరూర్ గైర్హాజరీపై ఎందుకు చర్చ జరుగుతోంది?

శశిథరూర్ పార్లమెంట్‌లో జరుగుతున్న కీలక చర్చలకు హాజరుకాకపోవడంతో రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో అతని గైర్హాజరీపై అనేక అనుమానాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన మౌనం వెనుక వ్యూహాత్మక కారణమా లేదా వ్యక్తిగత కారణమా అనే ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also: Loksabha : లోక్ సభలో నేడు ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక చర్చ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870