బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ Shah Rukh Khanకి చెందిన విలాసవంతమైన నివాసం ‘మన్నత్’ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. ముంబై బాంద్రా బీచ్ ప్రాంతంలోని ఈ ప్రముఖ బంగ్లాపై కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శనివారం బీఎంసీ మరియు అటవీ శాఖ అధికారులు మన్నత్లో తనిఖీలు చేశారు.27,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా ప్రస్తుతం ఆధునీకరణలో ఉంది. ఇందులో భాగంగా షారుఖ్ తన బంగ్లాలో అనుబంధంగా రెండు అంతస్తులు మరింతగా నిర్మించాలనే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. కానీ, ఇందుకోసం అవసరమైన అనుమతులు తీసుకున్నారా? అనే విషయంపై అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
షారుఖ్ కుటుంబం తాత్కాలికంగా వేరే ఇంటికి మారింది
ఈ నిర్మాణ పనుల కారణంగా, షారుఖ్ కుటుంబం తాత్కాలికంగా ఖార్లోని డూప్లెక్స్ Duplex అపార్ట్మెంట్లోకి మారింది. ఇది మన్నత్కి 10 నిమిషాల దూరంలోనే ఉంది. గౌరీ ఖాన్, ఆర్యన్, సుహానా, అబ్రామ్ ఈ డూప్లెక్స్లో నివసిస్తున్నారు. ఈ తరచుగా సందర్శిత ప్రాంతం అయిన మన్నత్కి కొన్ని వారాలుగా పునర్నిర్మాణం జరుగుతోంది.
పురాతన వారసత్వ కట్టడమైన మన్నత్
1914లో నిర్మితమైన ఈ భవంతిని షారుఖ్ 2001లో కొనుగోలు చేశారు. ఇప్పటికీ అభిమానులు మన్నత్ బంగ్లా వద్ద ఫొటోలు తీసుకునేందుకు. అయితే ఈ పునర్నిర్మాణం, అనుమతులపై సందేహాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
బీఎంసీ ఆదేశాల కోసం ఎదురుచూపులు
తనిఖీల అనంతరం బీఎంసీ అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరిగినా, వెంటనే నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. CRZ నిబంధనల ఉద్దేశ్యం తీరప్రాంతాల పర్యావరణాన్ని కాపాడటమే. అనధికార నిర్మాణాలు వాటిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు.షారుఖ్ ఖాన్ మన్నత్ ఇప్పుడు కేవలం సెలెబ్రిటీ మాత్రమే కాదు. ఇది నిబంధనలపై చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అధికార నివేదికలు వెలువడే వరకు ఈ వివాదంపై ఉత్కంఠ కొనసాగే అవకాశమే ఉంది.
Read Also : Helmet Rule : రెండు హెల్మెట్లు తప్పనిసరి : త్వరలో కొత్త రూల్?