ganjai

ఖరీదైన విదేశీ గంజాయి పట్టివేత

తెలంగాణ ప్రభుత్వం మత్తుపదార్థాలు లేని రాష్ట్రంగా చేసేందుకు యెంత కృషి చేస్తున్నా, ఆశించిన ఫలితం పొందడం లేదు. తాజాగా విదేశాల నుంచి ఖరీదైన గంజాయిని తెప్పించి.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అమ్ముతున్న వ్యక్తిని.. సిటీ శివారులోని రాయదుర్గంలో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అమెరికా.. కాలిఫోర్నియాలోని అరోమా ప్రాంతంలో హై క్వాలిటీ ఓ జీ కుష్ గంజాయిని రహస్యంగా పండిస్తున్నారు. దాన్ని అక్కడి నుంచి బెంగళూరుకి తెప్పించి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కి తెప్పిస్తున్నారు.
హై క్వాలిటీ గంజాయిలో టెట్రా హైడ్రో క్యాన్బినాన్ మత్తు పదార్థాన్ని కూడా కలుపుతున్నారు. సాధారణ గంజాయిలో 2 నుంచి 4 శాతం THC ఉంటే.. ఈ హై క్వాలిటీ గంజాయిలో అది 25 శాతం ఉంటుంది. అందువల్ల ఈ గంజాయి విపరీతమైన కిక్ ఇస్తుందని.. కొందరు దీన్ని ఎక్కువ డబ్బు చెల్లించి కొంటున్నారు.
ఈ గంజాయిని ఒక గ్రాము రూ.3వేలకు అమ్ముతున్నారు. దీనిపై సమాచారం రాగానే.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. రాయదుర్గంలోని టింబర్ లేక్ వ్యాలీ కాలనీ, ప్రశాంతి హిల్స్‌లో తనిఖీలు చేశారు. అక్కడ అక్రమంగా తరలిస్తున్న ఓ జీ కుష్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisements

పోలీసులు ఇద్దరు నిందితుల నుంచి 175 గ్రాముల ఓజి కుష్ గంజాయిని, ఒక కేజీ లూజ్ డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిలో ఒకరు అరెస్ట్ అవ్వగా.. బెంగళూరుకు చెందిన అజయ్ అనే వ్యక్తి పారిపోయాడు. పోలీసులకు దొరికిన వ్యక్తి శివరాం.. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి. తనే ఈ గంజాయిని హైదరాబాద్‌కి తెప్పించి.. తన తోటి ఉద్యోగులకు అమ్ముతున్నాడని తెలిసింది. ఇప్పుడు పోలీసులు.. ఈ గంజాయి విదేశీ మూలలపై ఫోకస్ పెడుతున్నారు. కర్ణాటక పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు.

Related Posts
తెలంగాణలో కొత్తగా 12 మున్సిపాలిటీలు
12 new municipalities in Te

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 12 ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అసెంబ్లీలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. తెలంగాణలో పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం Read more

తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ
AP Jithender Reddy

తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. గతంలో పార్లమెంటు సభ్యుడిగా సేవలందించిన జితేందర్, ఈసారి టీఓఏ అధ్యక్ష ఎన్నికల్లో Read more

Bettingapps: బెట్టింగ్ యాప్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ
BettingApps: హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ విష్ణుప్రియ!

తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ఇప్పటికే యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టాలీవుడ్ నటులు Read more

Telangana Budget: 3 వేల కోట్లతో రూపకల్పన చేసిన తెలంగాణ
ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు కేటాయించిన భట్టి విక్రమార్క

తెలంగాణ 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ రూపకల్పన తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క Read more

×