हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Satyavedu: సత్యవేడు సమన్వయకర్తగా శంకర్ రెడ్డి

Anusha
Satyavedu: సత్యవేడు సమన్వయకర్తగా శంకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది.సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నచోట ఇంఛార్జ్‌ను నియమించడం ఆసక్తికరంగా మారింది. పేరుకు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ అని చెబుతున్నా నియోజకవర్గ పగ్గాలు ఆయనకే అప్పగించారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్‌గా కూరపాటి శంకర్ రెడ్డిని నియమించింది టీడీపీ. ఈ మేరకు ఆయన పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.స్వయంగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ కార్యక్రమాన్నికి హాజరయ్యారు. కూరపాటి శంకర్ రెడ్డి తిరుపతికి చెందిన పారిశ్రామికవేత్త, ఆయన గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా కుదరలేదు. దీంతో తిరుపతి జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. శంకర్ రెడ్డి (Shankar Reddy) కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతుంటారు. అందుకే ఆయనకు సత్యవేడు బాధ్యతలు అప్పగించారని టాక్ వినిపిస్తోంది.

నియోజకవర్గ బాధ్యతల్ని

ప్రస్తుతం సత్యవేడులో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం ఉన్నారు.ఆయన ఉండగానే నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్‌ నియామకం ఆసక్తికరంగా మారింది. అయితే నియోజకవర్గంలో ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలను కోఆర్డినేట్ చేయడం కోసం శంకర్ రెడ్డిని నియమించారని చెబుతున్నా, నియోజకవర్గ బాధ్యతల్ని ఆయనకు అప్పగించారా, అనే చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (koneti Adimulam) గతేడాది ఓ వివాదంలో చిక్కుకున్నారు.ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. అయితే ఆయనపై ఫిర్యాదు చేసిన మహిళ తన ఆరోపణల్ని వెనక్కు తీసుకోవడంతో ఆదిమూలం మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. అంతా బావుందిలే అనుకుంటున్న సమయంలో సత్యవేడు నియోజకవర్గానికి ఇంఛార్జ్ నియామకం ఆసక్తికరంగా మారింది.

 Satyavedu: సత్యవేడు సమన్వయకర్తగా శంకర్ రెడ్డి
Satyavedu: సత్యవేడు సమన్వయకర్తగా శంకర్ రెడ్డి

కార్యకర్తలతో సమావేశం

సత్యవేడు నియోజకవర్గ బాధ్యతల్ని శంకర్ రెడ్డికి అప్పగించడం ద్వారా, అధిష్టానం మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఎవైనా సంకేతాలు పంపిందా అనే చర్చ జరుగుతోంది. అలాగే ఇటీవల మంత్రి నారా లోకేష్ సత్యవేడు నియోజకవర్గం (Satyavedu Constituency) లో పర్యటించేందుకు వెళ్లారు. ఆ సమయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే ఇలా ఇంఛార్జ్‌ను నియమించడం ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో సమన్వయ బాధ్యతల్ని శంకర్ రెడ్డికి అప్పగిచడంతో, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి ముందుకు సాగాల్సి ఉంటుంది. మరి ఈ ఇద్దరు నేతల మధ్య కో ఆర్డినేషన్ ఎలా ఉంటుందనే చర్చ, జరుగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: APSRTC : లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ఏసీ బస్సులో ప్రయాణించొచ్చు..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

ఈనెల 18న మార్చి నెల తిరుమల దర్శన కోటా విడుదల

ఈనెల 18న మార్చి నెల తిరుమల దర్శన కోటా విడుదల

విద్యార్థులకు వేడి ఆహారం అందించాలని మంత్రి సవిత ఆదేశాలు

విద్యార్థులకు వేడి ఆహారం అందించాలని మంత్రి సవిత ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

📢 For Advertisement Booking: 98481 12870