Russia: ఇండియన్ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి!

Russia: ఇండియన్ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి!

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్‌లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకుని మందుల నిల్వలు ధ్వంసమయ్యాయి. కుసుమ్‌ అనే కంపెనీకి చెందిన గోదాముపై ఈ దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయం వెల్లడించింది. రష్యా కావాలనే ఇండియన్‌ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటున్నదని విమర్శించింది.ప్రధానంగా పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాములపై దాడులు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేసింది. భారత్‌కు తాము మిత్రులమని చెప్పే రష్యా, కావాలనే ఇలా దాడులు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది. ఉక్రెయిన్‌లోని బ్రిటన్‌ రాయబారి మార్టిన్‌ హారిస్‌ కూడా రష్యా దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఫార్మా కంపెనీ గోడౌన్‌ పూర్తిగా ధ్వంసమైందన్నారు.

Advertisements

కాల్పుల విరమణ

అంతకుముందు ఉక్రెయిన్‌లోని బ్రిటన్‌ రాయబారి మార్టిన్‌ హారిస్‌ కూడా రష్యా చేసిన దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఫార్మా కంపెనీ గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌తో సహా 29 దేశాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కుసుమ్‌ హెల్త్‌కేర్‌ వెబ్‌సైట్‌లో ఉంది.గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- ఉక్రెయిన్‌, రష్యాలు కాల్పులు విరమణ చేయాలని ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.అయినప్పటికీ రష్యా, ఉక్రెయిన్‌లోని అనేక లక్షిత ప్రాంతాలపై దాడులు చేస్తూనే ఉంది.కాల్పుల విరమణపై చర్చించడానికి అమెరికా రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ శుక్రవారం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. కాగా అమెరికా ప్రతిపాదించిన తాత్కాలిక కాల్పుల విరమణను రష్యా నిరాకరించి శనివారం నాటికి సరిగ్గా నెల రోజులు అయ్యింది. దీనితో రష్యా చేస్తున్న దాడులే ‘శాంతి ఏకైక అడ్డంకి’ అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా ఆరోపించారు.

క్షిపణులు

జెడ్డాలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిన శాంతి చర్చలను సిబిహా ప్రస్తావిస్తూ, ‘కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది. కానీ రష్యా మాత్రం దీనికి నిరాకరించింది. బదులుగా షరతులు, డిమాండ్లను మా ముందు ఉంచింది’ అని అన్నారు.ఈ మార్చి 11 నుంచి ఏప్రిల్‌ 11 వరకు రష్యా, ఉక్రెయిన్‌పై ఏకంగా 70 రకాల క్షిపణులను, 2,200 కంటే ఎక్కువ షాహెద్ డ్రోన్‌లను, 6,000 కంటే ఎక్కువ గైడెడ్‌ వైమానిక బాంబులను ప్రయోగించిందని సిబిహా అన్నారు.

Read Also: NASA : రోదసి వ్యర్థాల రీసైక్లింగ్‌ ఎలా? పరిష్కారం సూచిస్తే రూ.25.82 కోట్లు బహుమతి: నాసా

Related Posts
Supreme Court: కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court: కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివాదాస్పద భూవిషయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు Read more

కమెడియన్ ఆలీకి నోటీసులు
ali notice

ప్రముఖ కమెడియన్ ఆలీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లా న‌వాబ్‌పేట్ మండ‌లం ఎక్మామిడిలోని ఫామ్‌హౌస్‌లో అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని గ్రామ కార్య‌ద‌ర్శి శోభారాణి ఆయనకు Read more

బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court notices to the Central and AP government

న్యూఢిల్లీ: బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదని న్యాయస్థానం అభిప్రాయ‌ప‌డింది. దేశంలో Read more

అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు
AP Annadata Sukhibhava Sche

రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు కసరత్తు ప్రారంభించింది. AP government is working to start the Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×