టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో లక్నోలో జరిగిన ఒక గ్రాండ్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు.ఈ కార్యక్రమం శనివారం, జూన్ 8, 2025న లక్నోలోని ది సెంట్రమ్ అనే 5-స్టార్ హోటల్లో చాలా ఘనంగా జరిగింది.నిశ్చితార్థానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నిశ్చితార్థ వేడుకకు మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, యూపీ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ హాజరయ్యారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ప్రొఫెసర్ రామ్గోపాల్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా, జయా బచ్చన్, శివపాల్ యాదవ్, తదితర రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అందరూ రింకూ, ప్రియా జంటను అభినందించారు. వారు అతిథులను పలకరించి వారితో ఫోటోలు దిగారు.
ఆశీర్వాదం తీసుకోవడానికి
రింకూ సింగ్, ప్రియా సరోజ్ సాంప్రదాయ దుస్తులలో కెమెరాకు పోజులిచ్చారు. రింకూ సింగ్(Rinku Singh) తన కుటుంబంతో కలిసి బులంద్షహర్లోని చౌదేరా వాలి విచిత్ర దేవి మందిర్లో ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రింకూ సింగ్, ప్రియా సరోజ్ తెలుపు, గులాబీ రంగు దుస్తులలో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమం పుల్కర్న్ హాల్(Pulkern Hall)లో జరిగింది. హాల్ను పువ్వులు, రంగురంగుల లైట్లతో అలంకరించారు. హాల్ 300 మందికి పైగా కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది.
ప్రత్యేక అతిథులు
అతిథుల సౌకర్యార్థం, ది సెంట్రమ్లో 15 రూమ్లు బుక్ చేశారు. రింకు సింగ్కు సన్నిహితుల కోసం ప్రత్యేకంగా 5 రూమ్లు కేటాయించారు. బార్కోడెడ్ పాస్లు ఉన్న అతిథులకు మాత్రమే ప్రవేశం కల్పించారు.క్రికెట్, రాజకీయాలకు చెందిన చాలా మంది ప్రత్యేక అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అతిథులకు వివిధ రకాల శాఖాహార వంటకాలు వడ్డించారు. ఈ ఆహారంలో రసగుల్లా, జీడిపప్పు-పనీర్ రోల్ వంటి బెంగాలీ స్వీట్లు, యూరోపియన్, ఆసియా వంటకాలు ఉన్నాయి. రింకూ ఇష్టమైన వంటకాలైన పనీర్ టిక్కా, మటర్ మలై కూడా మెనూలో ఉన్నాయి. దీనితో పాటు మలై కోఫ్తా, కధై పనీర్, వెజ్ మంచూరియన్, స్ప్రింగ్ రోల్ కూడా ఉన్నాయి.
సంచలనం సృష్టించిన
27 ఏళ్ల రింకు సింగ్ భారత క్రికెట్ జట్టులో కీలకమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు(Kolkata Knight Riders team)కు ఆడే రింకు 2023లో గుజరాత్ టైటాన్స్పై ఒకే ఓవర్లో ఐదు సిక్సులు కొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దేశీయ క్రికెట్ లో కూడా ఆయన మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే
26 ఏళ్ల ప్రియా సరోజ్, సమాజ్ వాదీ పార్టీ తరపున మచ్లీషహర్ నియోజకవర్గం(Machlishahar Constituency) నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఉత్తరప్రదేశ్లో అతి పిన్న వయస్కురాలైన ఎంపీలలో ఒకరిగా నిలిచారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు ఎంపీగా, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో BA డిగ్రీని, అమిటీ యూనివర్సిటీలో LLB డిగ్రీని పూర్తి చేసిన ప్రియా, రాజకీయాల్లోకి రాకముందు సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
Read Also: Bengaluru Stampede: తొక్కిసలాట.. ఆర్బీబీపై నిషేధం విధిస్తారా?