తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి హైకోర్టు ఓ ముఖ్యమైన కేసులో ఊరటనిచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం (SC and ST Atrocities Act) కింద ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2016లో హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది.

కేసు వెనుక ఉన్న పాత ఘటన
సొసైటీ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, మరొకరు లక్ష్మయ్యపై కేసు నమోదు అయ్యింది. ఇది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రిజిస్టర్ చేయబడింది. అప్పట్లో ఈ కేసు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
2020లో హైకోర్టులో పిటిషన్
ఈ కేసును రద్దు చేయాలంటూ రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై వాదనలు ఇటీవల పూర్తి అయ్యాయి. హైకోర్టు (High Court) జూన్ 20న వాదనలు ముగించుకుని తీర్పును రిజర్వ్ చేసింది.
తాజా తీర్పు వివరాలు
జులై 17న హైకోర్టు తుది తీర్పును ప్రకటించింది. ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి ఘటనాస్థలిలో లేరని న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది. అలాగే, ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో కేసు విచారణకు అర్హతలేమని తేల్చి, దానిని కొట్టివేసింది .
రేవంత్ రెడ్డిపై ఏ కేసు నమోదైంది?
2016లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి మరియు లక్ష్మయ్యపై గచ్చిబౌలిలోని సొసైటీ భూమిని ఆక్రమించేందుకు యత్నించారన్న ఆరోపణలతో నమోదైంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: KTR -Kavitha : కేటీఆర్, కవితపై సీఐడీకి TCA ఫిర్యాదు
Kunamaneni Sambasiva Rao: దేశంలో 60% సంపద 10% మంది వద్దే ఉంది