हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Revanth Reddy: సీఈ రమణారెడ్డిని తీవ్రంగా హెచ్చరించిన సీఎం రేవంత్

Sharanya
Revanth Reddy: సీఈ రమణారెడ్డిని తీవ్రంగా హెచ్చరించిన సీఎం రేవంత్

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో పలువురు ఉన్నతాధికారులు, ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ (సీఈ) రమణారెడ్డి పాల్గొన్నారు. రమణారెడ్డికి సీఎం తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక్కడ కూడా అలాగే చేస్తే కేసు పెట్టించి లోపల వేయిస్తా

రమణారెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, ఆయన గతంలో చేసిన తప్పిదాలను సీఎం ఉల్లేఖించారు. “అక్కడ చేసినట్లు ఇక్కడ చేస్తే కేసు పెట్టించి లోపల వేయిస్తా,” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం విషయంలో స్పష్టమైన ఆదేశాలు

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణ, పునరావాస ప్యాకేజీ (ఆర్ అండ్ ఆర్) సమస్యలు పూర్తిగా పరిష్కారమై, పంపుహౌస్‌ల పనులు ప్రారంభమైన తర్వాతే పైపులకు సంబంధించిన బిల్లులు సమర్పించాలని మహబూబ్‌నగర్‌ సీఈకి ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. గతంలో జరిగిన పొరపాట్లను ప్రస్తావిస్తూ, అలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది.

విజిలెన్స్ కేసుల నేపథ్యంలో స్పష్టమైన సందేశం

కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి నమోదైన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు ప్రస్తావిస్తూ, ఆ కేసుల్లో భాగమైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. అయితే, ఈ కేసులతో ఎలాంటి సంబంధం లేని అధికారులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ప్రాజెక్టుల నిర్మాణంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఒకటి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన పొరపాట్ల వల్ల విజిలెన్స్ కేసులు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో అలాంటివి జరగకుండా బాధ్యతగా పనిచేయాలని అధికారులకు ఉద్బోధించినట్లు సమాచారం.

పెండింగ్ బిల్లులకు నిధుల విడుదల-ఒప్పంద ఉద్యోగుల నియామకంపై స్పష్టత

సమావేశంలో ఒప్పంద సేవల ఉద్యోగుల వేతనాల అంశాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా, అవసరం ఉన్నంత వరకే కాంట్రాక్టు సిబ్బందిని నియమించుకోవాలని, దీనిపై ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ ప్రతిపాదనలు అందిన తర్వాత పరిశీలిస్తామని సీఎం చెప్పినట్లు తెలిసింది. ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతుల (ఓ అండ్ ఎం) కోసం పెండింగ్‌లో ఉన్న బిల్లులకు నెలకు రూ.50 కోట్లు, నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ. 75 కోట్ల వరకు కేటాయింపులు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. శిక్షణ సంస్థ వాలంతరికి రూ.10 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు చేపట్టాల్సిన పనులకు రూ.10 కోట్లు, దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తికి రూ.2 వేల కోట్లు అవసరమని అధికారులు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది.

Read also: Untimely Rains : వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం – మంత్రి దుద్దిళ్ల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చైనా మాంజా చుట్టుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు

చైనా మాంజా చుట్టుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు

నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ పోటీలు ..

నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ పోటీలు ..

సఫీల్ గూడ అమ్మవారి ఆలయంలో అపచారం
0:42

సఫీల్ గూడ అమ్మవారి ఆలయంలో అపచారం

మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు – మంత్రి రాజనర్సింహ

మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు – మంత్రి రాజనర్సింహ

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు

‘లైసెన్స్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

‘లైసెన్స్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

సినిమా టికెట్ రేట్ల పేరుతో కోట్లు వసూలు: హరీశ్ రావు

సినిమా టికెట్ రేట్ల పేరుతో కోట్లు వసూలు: హరీశ్ రావు

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ: కొత్త వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ: కొత్త వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు

సంక్రాంతి వేళ నాటుకోడి ధరలు భగ్గుమన్నాయి

సంక్రాంతి వేళ నాటుకోడి ధరలు భగ్గుమన్నాయి

రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు చలి హెచ్చరిక జారీ

రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు చలి హెచ్చరిక జారీ

📢 For Advertisement Booking: 98481 12870