వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వివాదాస్పద డైరెక్టర్ రామ్గోపాల్ వర్మకు..కాస్త ఊరట లభించింది. సీఐడీ పోలీసులు నమోదు చేసిన ఓ కేసుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించి నమోదైన కేసులో విచారణపై హైకోర్ట్ స్టే విధించింది. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని కోర్టు ప్రశ్నించింది. గుంటూరు సీఐడీ పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వివాదాస్పద డైరెక్టర్ రామ్గోపాల్ వర్మకు..కాస్త ఊరట లభించింది.

ఓ కేసుపై ఏపీ హైకోర్టు స్టే
సీఐడీ పోలీసులు నమోదు చేసిన ఓ కేసుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించి నమోదైన కేసులో విచారణపై హైకోర్ట్ స్టే విధించింది. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని కోర్టు ప్రశ్నించింది. గుంటూరు సీఐడీ పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు రామ్గోపాల్ వర్మ. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా తీశారంటూ వర్మపై గతంలో ఫిర్యాదులు అందాయి.
హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి తీయడంతో పాటు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఆర్జీవీపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సీఐడీ పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇవ్వడంతో పాటు విచారణకు హాజరుకావాలని కోరారు. అయితే సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్కి సంబంధించి ఆర్జీవీ తరపు న్యాయవాదులు నేడు తమ వాదన వినిపించారు. 2019లో విడుదలైన సినిమాపై ఇన్నాళ్లకు ఫిర్యాదు చేయడం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటి? అని ప్రశ్నించింది. అలాగే ఈ కేసుపై విచారణకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్జీవీపై సీఐడీ తదుపరి చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.