हिन्दी | Epaper

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుఫాను ముప్పు

Sharanya
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుఫాను ముప్పు

ఈ వేసవిలో ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే వార్తను భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ముఖ్యమైన వర్ష కాలమైన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఈ ఏడాది ఆరు రోజులు ముందుగానే కేరళ తీరం తాకనున్నాయి. సాధారణంగా జూన్ 1న కేరళకు రుతుపవనాలు చేరతాయి. కానీ ఈ సంవత్సరం మే 26 లేదా 27 నాటికి రానున్నట్లు IMD అంచనా వేసింది. దీని ప్రభావంగా తెలుగు రాష్ట్రాలలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

నైరుతి రుతుపవనాల ప్రవేశం

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల వ్యవసాయం పనులు బాగుంటాయని పేర్కొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరిస్తొంది. ఇది క్రమంగా తుఫాన్‌గా మారే అవకాశముందని అంచనా వేస్తోంది.

తుఫానుగా మారనున్న అల్పపీడనం

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం నేపథ్యంలో తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. రాష్ట్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లతో ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో ఈ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణకు – వరుసగా నాలుగు రోజుల వర్షాలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు నమోదయ్యే అవకాశముండటంతో Yellow Alert జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో ఇవాళ గరిష్టంగా ఆదిలాబాద్‌లో 33.8, కనిష్టంగా నిజామాబాద్లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు, మన్యం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరించారు. మత్స్యకారుల కోసం హెచ్చరికలు ఇప్పటికే జారీ అయ్యాయి.

Read also: Covid Cases: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు..జాగ్రత్తలు పాటించండి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870