Ragi in ration in AP.. Distribution ration shops from June

Ration shops : ఏపీలో రేషన్‌లో రాగులు.. జూన్ నుంచి పంపిణీ రేషన్‌ షాపులు

Ration shops : ఏపీ ప్రభుత్వం రేషన్‌ లబ్ధిదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండితో పాటుగా తృణధాన్యాలను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే జూన్‌ నెల నుంచి రేషన్‌కార్డులు ఉన్నవారికి రాగులు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుండగా.. ఈ మేరకు అవసరమైన సన్నాహాలు చేస్తోంది. రేషన్‌కార్డులు ఉన్నవారు రేషన్‌ బియ్యానికి బదులుగా రాగులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

Advertisements
ఏపీలో రేషన్‌లో రాగులు జూన్

రెండు కేజీలు రాగులు

ప్రతినెలా 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబం రెండు కేజీలు రాగులు కావాలనుకుంటే.. ఆ మేరకు ఇచ్చే బియ్యాన్ని మినహాయించేలా ప్లాన్ చేశారు అధికారులు. అయితే ఏడాదికి దాదాపు 25 వేల మెట్రిక్‌ టన్నుల రాగులు అవసరమవుతాయని పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు రాగులు సేకరించేందుకు తాజాగా టెండర్‌ నోటీసు జారీ చేసింది. జూన్ నెల నుంచి రాగుల్ని పంపిణీ చేసేందుకు ప్లాన్ చేశారు. ఏపీలో రేషన్‌ కార్డుదారులు ఉన్నవారికి ఈ నెలలోనూ కూడా కందిపప్పు అరకొరగా అందుతున్నాయి. ఈ నెల కూడా బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు.

ఈ నెలలో కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే

గత రెండు మూడు నెలలుగా కందిపప్పు పంపిణీ నిలిచిపోగా.. మార్చిలో ఇస్తారని భావించారు. అయితే ఏప్రిల్‌లో అయినా కందిపప్పు ఇస్తారని లబ్ధిదారులు అనుకున్నారు. ఈ నెలా సరిపడా కందిపప్పు రాలేదని ఎండీయూ వాహనాల సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం బయట మార్కెట్లో కిలో కందిపప్పు రూ.160 నుంచి రూ.180 వరకు ధర పలుకుతోంది. ఈ నెలలోనూ కందిపప్పు ఇవ్వకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఏప్రిల్‌ నెలకు కందిపప్పు సరఫరా కాలేదు. కందిపప్పును మే నెలలో వస్తుందని అంచనా వేస్తున్నారు. కందిపప్పు వచ్చే నెలలో సరఫరా అయితే లబ్ధిదారులకు పంపిణీ చేయిస్తామంటున్నాు అధికారులు. ఈ నెలలో కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు.

Related Posts
Minister Lokesh : చట్టాలు ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్: మంత్రి లోకేష్
Red Book only for those who violate laws.. Minister Lokesh

Minister Lokesh : మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నిరుపేద కుటుంబానికి శాశ్వత పట్టా అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ Read more

26/11 ముంబై దాడి నిందితుడు అప్పగింతకు ట్రంప్ అంగీకారం
Trump agrees to extradite 26/11 Mumbai attack suspect

భారత్‌కు తహవూర్‌ రాణా అప్పగింత – కీలక ముందడుగు భీకర ముంబయి ఉగ్రదాడి మరికొన్ని నెలల్లోనే అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలు. అమెరికా అనుమతితో భారత్‌కు న్యాయపరమైన Read more

China: రష్యా చమురు కొనుగోలు నిలిపివేసిన చైనా!
China stops buying Russian oil!

China: చమురు అంశంపై రష్యా, చైనా మధ్య దూరం పెరుగుతుంది. ఈ నెలలో రెండు సంస్థలు పూర్తిగా ఆయిల్‌ కొనుగోలు నిలిపివేయగా, మరో రెండు సంస్థలు ఆ Read more

ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపే ఆఖరు తేదీ
ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపే ఆఖరు తేదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపే ఆఖరు తేదీ కావడం తో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో యనమల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×