స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్లోని కొన్ని ప్రాంతాలలో సంభవించిన భారీ విద్యుత్ అంతరాయం నిజంగా గందరగోళ పరిస్థితులకు దారితీసింది. ఈ ఘటన కారణంగా రైళ్లు నిలిచిపోయాయి, ట్రాఫిక్ లైట్లు పనిచేయలేదు. ఎక్కడిక్కడ నగదు చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. స్పెయిన్లో మాడ్రిడ్, బార్సిలోనా నగరాల్లో మెట్రో రైళ్లు మధ్యలో ఆగిపోయాయి. ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. దుకాణాలు మూతపడ్డాయి; నగదు చెల్లింపులు నిలిచిపోయాయి. ఏటీఎంలు పని చేయకపోవడంతో ప్రజలు నగదు కోసం ఇబ్బందులు పడ్డారు.

పోర్చుగల్లో రవాణా వ్యవస్థకు భారీ దెబ్బ
లిస్బన్, పోర్టో వంటి నగరాల్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి.
రైళ్లు పట్టాలపై నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ లైట్లు పని చేయకపోవడంతో రోడ్లపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఫ్రాన్స్లో సరిహద్దు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. కొన్ని భాగాలు, ముఖ్యంగా స్పెయిన్, పోర్చుగల్ సరిహద్దుల్లో ఉండే ప్రాంతాలు స్వల్పంగా ప్రభావితమయ్యాయి.
విద్యుత్ అంతరాయం – కారణాలపై దర్యాప్తు
ఘటనకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. యూరోపియన్ విద్యుత్ నెట్వర్క్ లోపం కారణమా? లేక ఇతర సాంకేతిక సమస్యా అన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది.
ప్రభుత్వ చర్యలు
స్పెయిన్, పోర్చుగల్ ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు నిర్వహించాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణకు కొన్ని గంటలు పడొచ్చని అధికారులు తెలిపారు. మిలియన్ల మంది ప్రజల రోజువారీ జీవితం తీవ్రంగా తారుమారైంది. రవాణా, కమ్యూనికేషన్, కొనుగోలు వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆఫీసులు, వ్యాపార సంస్థలు పనిచేయకపోవడంతో ఆర్థిక నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. పోర్చుగల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లిస్బన్ , పోర్టో నగరాల్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి, రైళ్లు పట్టాలపై నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో రోడ్లపై గందరగోళం నెలకొంది. ఫ్రాన్స్లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు కూడా ఈ విద్యుత్ అంతరాయం వల్ల స్వల్పంగా ప్రభావితమయ్యాయి.
Read Also: Pakistan: సరిహద్దుల్లో చైనా శతఘ్నులను మోహరిస్తున్న పాక్