అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం: భారతదేశ విమాన చరిత్రలోనే అతిపెద్ద బీమా క్లెయిమ్
జూన్ 12, 2025న అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం (Plane Crash) దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రయాణికులతో నిండిన ఈ విమానం రన్వేకు సమీపంలో కుప్పకూలిన దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ కళ్ళెదురుగా జరిగిన విషాదాన్ని మరిచిపోలేరు. ఈ ఘోర ప్రమాదంలో 274 మంది అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడం దేశానికే నష్టం. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా, కీలక సమాచారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది.

మూడు నెలల కిందటే అమర్చిన ఇంజిన్.. ఫోకస్లో మెయింటెనెన్స్
దర్యాప్తులో మొదటిగా వెలుగులోకి వచ్చిన అంశం – ఈ విమానం కుడివైపు ఇంజిన్ను కేవలం మూడు నెలల క్రితమే ఓవర్హాలింగ్ సమయంలో అమర్చినట్లు అధికారుల నిర్ధారణ. ఈ బోయింగ్ 787 విమానం సుమారు 12 సంవత్సరాలుగా వినియోగంలో ఉండగా, చివరిసారిగా జూన్ 2023లో రొటీన్ మెయింటెనెన్స్ జరిగింది. తదుపరి షెడ్యూల్ డిసెంబర్ 2025లో ఉండాల్సి ఉండగా, అప్పటికే ఇంజిన్ మార్పు జరగడం ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. ఇంజిన్ ఫిట్టింగ్, పనితీరు, ప్రమాణాలపై నిపుణులు క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు.
రూ.4,000 కోట్లకు పైగా బీమా క్లెయిమ్ అంచనా – భారత వైమానిక చరిత్రలో అరుదైన ఘటన
కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వ రంగ నాన్-లైఫ్ ఇన్స్యూరెన్స్ దిగ్గజం జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ) మొత్తం క్లెయిమ్లు సుమారు 475 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.4,091 కోట్లు)గా అంచనా వేసింది. ఇది మన దేశంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక విమాన బీమా క్లెయిమ్గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ భారీ మొత్తంలో విమానం నష్టానికి గాను 125 మిలియన్ డాలర్లు కాగా, ప్రయాణికుల కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, థర్డ్ పార్టీ నష్టాలు, ఇతర వ్యక్తులకు జరిగిన నష్టాలు, ట్రావెల్ పాలసీల కింద మరో 350 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని జనరల్ ఇన్స్యూరెన్స్ సీఎండీ రామస్వామి నారాయణన్ వెల్లడించారు.
బీమా కవరేజీ పెంపు.. ప్రమాదానికి ముందే జాగ్రత్త?
ఇక్కడ గమనించదగిన విషయం ఇదిలా ఉండగా, ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బీమా వివరాలు చర్చనీయాంశంగా మారాయి. ఈె ప్రమాదం కారణంగా దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన బీమా క్లెయిమ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ డ్రీమ్లైనర్ విమానానికి సంబంధించి ఎయిర్ ఇండియా సంస్థ బీమా కవరేజీని ఇంజిన్ మార్పిడికి ముందే రూ.750 కోట్ల నుంచి రూ.850 కోట్లకు పెంచింది.
అసలు విమాన ఖరీదికి రెండున్నర రెట్లు నష్టం – ఎయిరిండియా ఆర్థిక భారం
ఈ ప్రమాదం వల్ల ఎయిరిండియా సంస్థకు ఏర్పడిన ఆర్థిక భారం విమానం అసలైన ధర కంటే రెండు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. ప్రయాణికుల కుటుంబాలకు పరిహారం, విమాన నష్టం, ఇతర చట్టబద్ధ నష్టాల చెల్లింపులతో కలిపి, మొత్తం వ్యయం భారీగా మారింది. ఇదే సమయంలో, బీమా సంస్థలపైనా భారీ ఒత్తిడి నెలకొంది. ఇక ప్రభుత్వానికి సమగ్ర నివేదికతోపాటు జవాబుదారీతనమూ వహించాల్సిన అవసరం ఏర్పడింది.
Read also: CM Revanth: హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ సెంటర్ను ప్రారంభించిన సీఎం రేవంత్