PawanKalyan: ద‌ర్శ‌కుడు ర‌మేశ్ కు సానుభూతి తెలిపిన ప‌వ‌న్ కళ్యాణ్

PawanKalyan: ద‌ర్శ‌కుడు ర‌మేశ్ కు సానుభూతి తెలిపిన ప‌వ‌న్ కళ్యాణ్

ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే గురువారం (మార్చి 27) పరిస్థితి విషమించడంతో సత్యవతి తుది శ్వాస విడిచారు. దీంతో మెహర్ రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు హైద‌రాబాద్‌లో క‌న్నుమూశారు. ఆమె మ‌ర‌ణ వార్త‌తో మెహ‌ర్ ర‌మేశ్ కుటుంబ సభ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.స‌త్య‌వ‌తి మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ స‌త్య‌వ‌తి మ‌ర‌ణం ప‌ట్ల ఆయ‌న ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థించారు.

మెహ‌ర్ ర‌మేశ్

మెహ‌ర్ ర‌మేశ్ కుటుంబం విజయవాడ‌లోని మాచవ‌రం ప్రాంతంలో నివ‌సించేది. తన చిన్న‌నాటి రోజుల‌ను గుర్తుచేసుకుంటూ, విద్యార్థి దశలో వేసవి సెలవుల్లో మాచవరం వెళ్లేవాడినని, అప్పట్లో వారి ఇంట్లో గడిపిన జ్ఞాపకాలు ఇప్పటికీ చెర‌గ‌నివ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.పవన్ కల్యాణ్ తన ప్రకటనలో సత్యవతి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని , ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి తాను అండగా ఉంటానని తెలిపారు. ఈ వార్త‌ విని తనకు ఎంతో బాధ కలిగిందని, మెహ‌ర్ ర‌మేశ్ కుటుంబం ఈ క‌ష్ట‌కాలాన్ని అధిగ‌మించాల‌ని ఆకాంక్షించారు.

ప్రగాఢ సానుభూతి

టాలీవుడ్ దర్శక, నటులు, ఇతర పరిశ్రమలోని ప్రముఖులు కూడా మెహర్ రమేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఇతర సినీ ప్రముఖులు కూడా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.స‌త్య‌వ‌తి మరణం మెహర్ రమేష్ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని సినీ పరిశ్రమ మొత్తం కోరుకుంటోంది.

మెహర్ రమేష్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి పెరిగాడు . అతని తండ్రి నగరంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. రమేష్ మాచవరంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరులో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశాడు. ఇక దర్శకుడు కావడానికి ముందు మెహర్ రమేష్ బాబీ సినిమాలో ఓ సహాయక పాత్రను పోషించాడు. ఆ తర్వాత కన్నడ చిత్రం వీర కన్నడిగ (2004) తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు మెహర్. ఇది తెలుగులో ఆంధ్రావాలా (2004)గా రిలీజైంది. అతని రెండవ చిత్రం అజయ్ (2006). ఇది మహేష్ ఒక్కడుకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యయి. కానీ తెలుగులో మాత్రం మెహర్ కు సరైన విజయం దక్కలేదు.

Related Posts
అదే యానిమల్‌ పార్క్‌ లక్ష్యం
animal movie

రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.900 కోట్లు Read more

Narne nithiin;త్వరలోనే పెళ్లి డేట్‌ నిర్ణయం,
narne nithin

‘మ్యాడ్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌ ఇటీవల ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ భార్య ప్రణీత సోదరుడు అయిన నితిన్, ఈ వేడుకలో Read more

కల్కి సీక్రెట్స్ రివీల్ చేసిన మేకర్స్‌
కల్కి సీక్రెట్స్ రివీల్ చేసిన మేకర్స్‌

కల్కి 2898 ఏడీ ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి భాగం విడుదల సమయంలోనే సీక్వెల్‌ను మరో స్థాయిలో చూపించబోతున్నామని యూనిట్ హింట్ Read more

ఏఎన్నార్ బయోపిక్ మీద నాగ్ కామెంట్
nagarjuna

అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్‌) జీవితాన్ని బయోపిక్‌గా తీసుకురావడం గురించి ప్రశ్నిస్తే, ఆయన కుమారుడు నాగార్జున ఎప్పుడూ ఒకేలా స్పందిస్తారు. "నాన్నగారి జీవితం విజయాల పర్యాయపదం. ఒక జీవిత Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *