amith shah

అమిత్ షాతో పర్వేశ్ వర్మ భేటీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా బీజేపీ దూసుకుపోతుండటంతో… దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దేశ రాజధానిలో జెండా ఎగురవేయాలనే బీజేపీ 27 ఏళ్ల కల ఈరోజు నెరవేరబోతోంది. మరోవైపు, ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. సీఎం రేసులో కొన్ని పేర్లు వినిపించినప్పటికీ… చివరిగా పర్వేశ్ వర్మ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అమిత్ షాతో పర్వేశ్ వర్మ భేటీ

న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ ను పర్వేశ్ వర్మ మట్టి కరిపించారు. దీంతో, ఆయన పేరు బీజేపీ శ్రేణుల్లో మారుమోగుతోంది. కాసేపటి క్రితం అమిత్ షా నుంచి ఆయనకు పిలుపు వెళ్లడంతో… తన నివాసం నుంచి ఆయన అమిత్ షా నివాసానికి వెళ్లారు. అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. సీఎం పదవిపై వీరిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో సీఎం పదవికి పర్వేశ్ వర్మ పేరు దాదాపు ఖరారయినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కేజ్రీవాల్‌ను ఓడించిన మాజీ సీఎం కుమారుడు

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ సాబిబ్ సింగ్ వర్మ. జాట్ కుటుంబానికి చెందిన ఇతడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసి 2013లో రాజకీయ జీవితం మొదలుపెట్టాడు. బీజేపీ తరపున 2013 నుంచి 2014 మధ్య మెహ్‌రౌలి నియోజకవర్గంలో గెలిచి ఢిల్లీ అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. తర్వాతి ఏడాదే పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 2 లక్షల 68 వేల పైచిలుకు ఓట్లు సాధించి రికార్డు మెజార్టీతో పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఓటమనేదే ఎరుగకుండా తన రికార్డును తానే బద్దలు కొడుతూ 2019, 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నాడు.

Related Posts
ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్‌కు సీఎం శంకుస్థాపన..
CM Revanth Reddy laid the foundation stone for the new building of Osmania Hospital

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియం వద్ద కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్ భవనానికి శుక్రవారం Read more

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి
satyanarayana

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) అనారోగ్య కారణాలతో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు. మాడుగుల నియోజకవర్గం నుంచి Read more

రెడ్‌మీ నోట్‌ 14 5G సిరీస్‌లో ₹1000 కోట్ల మైలురాయి సంబరాలు
Redmi Note 14 5G series celebrates ₹1000 crore milestone

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్‌ X Alot బ్రాండ్‌ షౌమీ ఇండియా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో ఆవిష్కరణలను పునర్‌నిర్వచిస్తూ అంతర్జాతీయంగా సరికొత్త ఫోన్‌ రెడ్‌మీ 14C Read more

‘పుష్ప 2’ తొక్కిసలాట 2 కోట్ల పరిహారం
'పుష్ప 2' తొక్కిసలాట 2 కోట్ల పరిహారం

'పుష్ప 2' తొక్కిసలాట 2 కోట్ల పరిహారం: గాయపడిన చిన్నారి కుటుంబానికి అల్లు అర్జున్, చిత్ర నిర్మాతలు నష్టపరిహారం హైదరాబాద్‌లో ‘పుష్ప-2’ సినిమా ప్రదర్శన సందర్భంగా చోటు Read more