దేశం మొత్తం వేచి చూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Sessions) జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ తేదీలకు ఆమోదం తెలపగా, ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) సోషల్ మీడియాలో వెల్లడించారు.

సమావేశాల పొడిగింపు
ఈ సమావేశాలు మొత్తం 26 రోజులు జరగనున్నాయి. అయితే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆగస్టు 13, 14 తేదీల్లో సభలు ఉండవు. ముందుగా ఈ సమావేశాలు ఆగస్టు 12తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మరో వారం రోజుల పాటు పొడిగించారు(Extended for a week) . ప్రభుత్వం ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. అందులో అణుశక్తి రంగంలో ప్రైవేటు సెక్టర్ ప్రవేశాన్ని అనుమతించే చట్టాలు ఉన్నాయి. సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, అటామిక్ ఎనర్జీ చట్టంలో సవరణలు చేయాలని అనుకుంటోంది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రకటనను అమలు చేయడానికే ఈ వారం రోజుల వ్యవధిని పొడిగించినట్లు తెలుస్తోంది.
విపక్షాల డిమాండ్లు – భద్రతా, రాష్ట్రీయ అంశాలపై కేంద్రంపై ఒత్తిడి
ఈ వర్షాకాల సమావేశాల్లో (Parliament Monsoon Sessions) పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యపై స్పష్టత ఇవ్వాలని కోరాయి. ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను కూడా తెలపాలని పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలోనే వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉంది.
గత సమావేశాల గుర్తు – వక్ఫ్ బిల్లు, విశ్వవిద్యాలయ చట్టం
ఇక గత బడ్జెట్ అయితే 2025లో జనవరి 31వ తేదీ- ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అప్పుడే ఉభయసభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమెదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో బిల్లుగా మారింది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమావేశాల్లో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు 2025 కూడా ఆమెదం పొందింది.
Read also: Delhi: ఢిల్లీ లో జంట హత్యల కలకలం