हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Rahul: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మీడియా హైలెట్

Vanipushpa
Rahul: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మీడియా హైలెట్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్(Pakistan) మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. పాకిస్తాన్‌తో దాడుల సందర్భంగా భారత్(Bharath) ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందని రాహుల్ గాంధీ ప్రశ్నించగా.. ఇప్పటికే అసత్య ప్రచారాలు చేస్తున్న పాక్ మీడియా.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో వారి వాదనలకు బలం చేకూర్చేలా మరింత ప్రచారం ముమ్మరం చేసింది. అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ నిరాధారమైన ఆరోపణలుగా కొట్టిపారేసింది. ఆపరేషన్ సిందూర్ దాడుల గురించి పాక్ ఆర్మీకి ముందే సమాచారం ఇచ్చారని జైశంకర్ చేసినట్లుగా ఉన్న వీడియోను పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ.. తీవ్ర దుమారానికి కారణం అయ్యారు.

పాకిస్తాన్ మీడియా భారీగా ప్రచారం
ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు పాకిస్తాన్ మీడియా బాగా హైలెట్ చేస్తూ.. సంబరపడిపోతోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ మీడియా భారీగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ఫెయిల్ అయిందని.. ఈ దాడుల్లో భారత్‌ను తాము ఓడించామని ఆ దేశం ప్రచారం చేసుకుంటోంది. భారత సైన్యం చేసిన దాడుల్లో ఎయిర్ బేస్ ధ్వంసం అయినా.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు కోల్పోయినా పాక్ సైన్యం, ప్రభుత్వం మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. భారత్‌కు చెందిన 5 ఫైటర్ జెట్స్‌ని.. మరీ ముఖ్యంగా రఫేల్‌ యుద్ధ విమానాన్ని కూల్చేశామంటూ పాకిస్తాన్ ఇప్పటికే అబద్ధపు ప్రచారం చేసుకుంటోంది.

అయితే ఓ వైపు పాకిస్తాన్ చేస్తున్న ప్రచారానికి.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా తోడవడంతో ఇప్పుడు పాక్ మీడియా మరింత రెచ్చిపోతోంది.

Read Also: YOUTUBER JYOTI: హిందూ ఆలయాలపై జ్యోతి కుట్రలు ?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870