हिन्दी | Epaper

Pakistan GDP : పాకిస్థాన్ ,తమిళనాడు ఆర్థిక వ్యవస్థ …

Divya Vani M
Pakistan GDP : పాకిస్థాన్ ,తమిళనాడు ఆర్థిక వ్యవస్థ …

ఒకప్పుడు పాకిస్థాన్ ఆర్థికంగా కొన్ని భారత రాష్ట్రాలకంటే ముందుండేది.Pakistan GDP కానీ ఇప్పుడు దాని పరిస్థితి పూర్తిగా తారుమారైంది.తాజా గణాంకాల ప్రకారం, పాకిస్థాన్ స్థూల జాతీయోత్పత్తి (GDP) ఇప్పుడు తమిళనాడుకంటే తక్కువ. ఇది ప్రపంచ ఆర్థిక నిపుణులకు కూడా షాక్ ఇచ్చింది.పాకిస్థాన్ జనాభా, తమిళనాడుతో పోలిస్తే దాదాపు మూడింతలు. అయినా ఆర్థిక పురోగతిలో తమిళనాడు దూసుకెళుతోంది. ఈ రాష్ట్ర GDP, పాకిస్థాన్ మొత్తాన్ని దాటింది.సగటు సంపాదన పరంగా చూస్తే తేడా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో ప్రజల ఆదాయం, పాకిస్థాన్ ప్రజలకంటే మూడింతలు ఎక్కువ.

గతం ఎలా ఉంది?

1995లో పాకిస్థాన్ GDP సుమారు 57.9 బిలియన్ డాలర్లు. అదే సమయంలో తమిళనాడు GDP 15.7 బిలియన్ డాలర్లే. కానీ 2025కి గణితమే మారిపోయింది.
ఇప్పుడు తమిళనాడు GDP 419.5 బిలియన్ డాలర్లు (రూ. 35.8 లక్షల కోట్లు). పాకిస్థాన్ GDP మాత్రం 397.5 బిలియన్ డాలర్ల (రూ. 33.9 లక్షల కోట్లు) వద్దే.
ఈ గణాంకాలు చూస్తే, అభివృద్ధిలో ఎవరు ముందున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది.

నిపుణుల సూచన ఇదే

నౌక్రీ.కామ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీ మాట్లాడుతూ, పాకిస్థాన్ మారాల్సిన అవసరం ఉందన్నారు. “ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానేయాలి,” అన్నారు ఆయన.ఆర్థికాభివృద్ధి, విద్య, మౌలిక సదుపాయాలపై దృష్టిపెడితేనే మార్పు సాధ్యమని సూచించారు. కాశ్మీర్ వివాదం పక్కన పెట్టాలని కూడా హితవు పలికారు.

నెటిజన్ల స్పందన ఆసక్తికరం

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయులు తమ దేశ పురోగతిపై గర్వంగా స్పందిస్తున్నారు. పాకిస్థాన్ పరిస్థితిని చూసి అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఒక యూజర్ రాసిన కామెంట్ హైలైట్ అయ్యింది:”కోయంబత్తూరు విమానాశ్రయం విస్తరణ అయితే, ఆ ప్రాంతం ఒక్కటే పాకిస్థాన్ GDPని దాటేస్తుంది!”

మరో యూజర్ అయితే:

“గుజరాత్, కర్ణాటక ఇప్పటికీ పాకిస్థాన్‌ను అధిగమించాయి,” అన్నారు.ఈ గణాంకాలన్నీ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. రాజకీయ శత్రుత్వం కాదు, ప్రజల భవిష్యత్తే ముఖ్యం. అభివృద్ధికి దారి అదే.పాకిస్థాన్ సైన్యం, పాలకులు ఆ మార్గాన్ని ఎప్పటికి ఎంచుకుంటారన్నది చూడాలి.

Read Also : JMI : టర్కీ విద్యా సంస్థలతో ఒప్పందాలు నిలిపివేత…

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870