हिन्दी | Epaper

War : భారత్ పై పాక్ మరోసారి డ్రోన్ల దాడి

Sudheer
War : భారత్ పై పాక్ మరోసారి డ్రోన్ల దాడి

భారత్-పాక్ (India – Pak ) మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ, పాకిస్థాన్ మరోసారి దాడులకు (Pak Attack Night Time) తెగబడింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని సాంబా ప్రాంతంలో పాక్ డ్రోన్లు భారత భూభాగంలోకి ప్రవేశించాయి. అయితే భారత వైమానిక రక్షణ వ్యవస్థ అప్రమత్తంగా స్పందించి ఈ డ్రోన్లను సమర్థంగా అడ్డుకుంది. ఈ ఘటన నేపథ్యంలో సాంబాలోని అధికారులంతా హై అలర్ట్ ప్రకటించగా, ప్రాంతంలో బ్లాక్ అవుట్ కూడా అమలు చేశారు.

నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు

పాక్ సైన్యం ఈ దాడులతో పాటు, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు కూడా జరుపుతోంది. ఇది రెండు దేశాల మధ్య వాస్తవాధారిత చర్చలపై చెడు ప్రభావం చూపించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శాంతిని కోరుకుంటామని ప్రకటిస్తున్న పాకిస్థాన్, మరోవైపు ఆక్రమణాత్మక చర్యలకు పాల్పడుతోంది. ఇది భారత్ భద్రతాపరంగా పెద్ద సవాలుగా మారుతోంది.

పఠాన్కోట్, అమృత్సర్ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు

ఇక మరోవైపు పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్, అమృత్సర్ ప్రాంతాల్లో కూడా పాక్ డ్రోన్లు దాడులకు తెగబడ్డాయి. ఈ కారణంగా అమృత్సర్ విమానాశ్రయంలో మూడు పౌర విమానాల రద్దు చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. పాక్ వ్యవహార శైలి పట్ల భారత్ కఠినంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also : India – Pakistan War : యుద్ధం ఇంకా ఆగిపోలేదు – మోడీ సంచలన వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870