పాకిస్థాన్ (pakistan) అష్టదిగ్భందనంలో చిక్కుకుంది. దౌత్య పరంగా ఏకాకి అయింది. భారత్ ఆపరేషన్ సింధూర్ తో పై చేయి సాధించింది. పాక్ భూ భాగంలోని ఉగ్ర శిబిరాలను నేల మట్టం చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు బెట్టింది. భారత్ దాడులకు కనీస ప్రతిఘటన ఇవ్వలేక పోయింది. భారత్ అనుకున్నది చేసిందంటూ పాక్ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన బలుచిస్తాన్ ఆర్మీ (balochistan army) వరుస దాడులకు పాక్ సైన్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరుగుతోంది. దీంతో.. పాక్ విలవిల్లాడుతోంది.

ఉగ్రవాదులను మట్టు బెట్టింది
పాకిస్తాన్ ను భారత్ ఆపరేషన్ సింధూర్ తో చావు దెబ్బ కొట్టింది. పాక్ తో పాటుగా పీఓకేలోని ఉగ్ర శిబిరాల పై గురి పెట్టి కూల్చి వేసింది. ఉగ్రవాదులను మట్టు బెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ పై పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని బోలాన్, కెచ్ ప్రాంతంలో రెండు వరుస దాడులకు దిగింది. ఇందులో 14 మంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మరణించారు. బోలాన్లోని మాచ్లోని షోర్కాండ్ ప్రాంతంలో పాక్ సైనిక కాన్వాయ్పై రిమోట్-కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ దాడి చేసింది. శక్తివంతమైన పేలుళ్లలో వాహనంలో ప్రయాణిస్తున్న 12 మంది సైనికులు మరణించారు. వీరిలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్ ఉన్నారు.
దాడిలో ఇద్దరు పాక్ ఆర్మీ సిబ్బంది మృతి
రెండవ సంఘటనలో బలూచ్ కార్యకర్తలు కెచ్లోని కులగ్ టిగ్రాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను లక్ష్యంగా చేసుకున్నారు.ఈ దాడిలో ఇద్దరు పాక్ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. చాలా కాలంగా బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్నారు. పాకిస్థాన్ ఎప్పటికప్పుడు వారిని అణచివేస్తూ వస్తోంది. ఇటు భారత్ పాక్ లోని ఉగ్రవాద శిబిరాల పైన గురి పెట్టి 23 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేసింది. ఈ దాడితో పాకిస్థాన్ అతలాకుతలమైంది. పాకిస్థాన్ ఆర్మీ ఫోకస్ మొత్తం ఇండియాపైనే పెట్టింది. ఇక ఇదే సందు అనుకొని.. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్ సైనికులపై దాడులకు పాల్పడుతూ.. పాకిస్థాన్ను మరింత ఇబ్బంది పెడుతోంది. ఇలా ఒక వైపు ఇండియా, మరోవైపు బలూచిస్థాన్ దాడులతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
Read Also: Operation Sindoor: పాక్ యుద్ధం వేళ రాజస్థాన్, పంజాబ్లలో హై అలర్ట్