Fish: అయ్యో చేప ఎంత పని చేసింది చివరకు ఏమైంది

Fish: అయ్యో చేప ఎంత పని చేసింది చివరకు ఏమైంది

తమిళనాడులోని చెన్నై సమీపంలో ఒక విషాదకర సంఘటన జరిగింది.మధురాంతకంలో ఉంటున్న మణికందన్ అనే 29 ఏళ్ల వ్యక్తి తాను పట్టుకున్న చేప తన శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో మరణించాడు. మధురాంతకంలోని ఒక సరస్సులో మంగళవారం ఉదయం అతడు చేపలు పట్టేందుకు వెళ్లాడు. ముందుగా ఒక చేపదొరికింది. అక్కడే మరొకటి కనిపించింది. దాంతో ముందుగా పట్టుకున్న చేపను ఎక్కడో పెట్టాలో అర్థం కాకపోవటంతో దాన్ని నోటితో పట్టుకుని మరో చేప కోసం ప్రయత్నించాడు.ముందుగా దొరికిన చేపను నోట్లో పెట్టుకున్న మణికందన్‌ మరొకదాన్ని రెండు చేతులతో పట్టుకోవడానికి నీళ్లలోకి వంగి పట్టుకున్నాడు. అప్పుడే అతని నోటిలో ఉన్న చేప నోట్లోకి తల దూర్చి మరింత లోపలికి వెళ్లి అతని శ్వాసనాళంలోకి దూసుకెళ్లింది. దాంతో మణికందన్‌ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ గిలగిలాడిపోయాడు. గొంతులోకి దూసుకెళ్లిన చేపను బయటకు లాగడానికి ప్రయత్నిస్తూ నీటిలోంచి బయటకు పరుగెత్తాడు. భయాందోళనతో అతను సమీపంలోని అరయ్యప్పక్కం గ్రామంలోని తన ఇంటి వైపు పరిగెత్తాడు. అతని గొంతులోకి దూరిన చేపను తొలగించడానికి కొంతమంది స్థానికులు ప్రయత్నించారు.కానీ దాని వీపుపై ఉన్న ముళ్లు పొడువుగా ఉండడంతో, శ్వాసనాళ మార్గంలో చిక్కుకున్నందున వారు దాన్ని బయటకు లాగలేకపోయారు. హుటాహుటిన మణికందన్‌ను చెంగల్‌పేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయినట్లుగా ప్రకటించారు. రోజువారీ కూలీ అయిన మణికందన్ సరస్సులో చేపలు పట్టేవాడని, తను చేతులతోనే చేపలు పట్టడంలో నిపుణుడని స్థానికులు తెలిపారు. అతను సాధారణంగా ఎప్పూడు స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లేవాడని, కానీ మంగళవారం అతను ఒంటరిగా వెళ్లినట్టుగా చెప్పారు. దాంతో అతనికి సాయం చేయడానికి దగ్గరల్లో ఎవరూ లేకుండా పోయారని గ్రామస్తులు వాపోయారు. మణికందన్‌ మరణంతో వారి కుటుంబం, అటు గ్రామంలోనూ విషాధ ఛా యలు అలుముకున్నాయి.

Advertisements
 Fish: అయ్యో చేప ఎంత పని చేసింది చివరకు ఏమైంది

జాగ్రత్తలు

చేపలను నోట్లో పెట్టకూడదు,తాత్కాలికంగా చేపను ఉంచడానికి చిన్న ప్యాకెట్ లేదా బకెట్‌ను ఉపయోగించాలి.ఎప్పుడూ కనీసం ఇద్దరు కలిసి వేటకు వెళ్లాలి.లైఫ్ జాకెట్లు, గ్లౌజ్‌లు, బూట్లు వంటివి ధరించాలి.

Read also: RBI: లక్ష నుండి 2 లక్షల వరకు ఆర్బీఐ అనుమతి

Related Posts
బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం..
Union Cabinet approves budget

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం Read more

రాహుల్ పై సభాహక్కుల ఉల్లంఘన
rahul gandhi

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్నీ ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీలు యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్బంగా రాష్ట్రపతి Read more

శంషాబాద్‌లో వైష్ణోయ్ సౌత్‌వుడ్స్‌ను ఆవిష్కరించిన వైష్ణోయ్ గ్రూప్
Vaishnoi Group Launches Vai

హైదరాబాద్, నవంబర్ 15, 2024 - శంషాబాద్‌లోని మామిడిపల్లిలో ప్రత్యేక విల్లా కమ్యూనిటీ వైష్ణోయ్ సౌత్‌ వుడ్స్‌ను ప్రారంభించినట్లు వైష్ణోయ్ గ్రూప్ సగర్వంగా ప్రకటించింది. ఈ గ్రాండ్ Read more

అమల్లోకి కొత్త పెన్షన్ విధానం
అమల్లోకి కొత్త పెన్షన్ విధానం

ఉద్యోగులకు పెన్షన్ విధానంలో మార్పులు తెస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇక నుంచి ఏకీకృత పెన్షన్ స్కీం (UPS) Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×