Phalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రదాడితో సంబంధం లేదన్న పాకిస్థాన్ స్పందించిన ఒమర్ అబ్దుల్లా

Phalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రదాడితో సంబంధం లేదన్న పాకిస్థాన్ స్పందించిన ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని దాయాది పాకిస్థాన్ ప్రకటన చేసింది. కానీ, అంతలోనే ఆ దేశం మాటమార్చింది. పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి తాము సిద్దమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.ఈ ప్రకటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. తొలుత ఈ ఘటనను తోసిపుచ్చిన పాకిస్థాన్, భారత్‌పై నిందలు వేసిందని విమర్శించారు.ఇప్పుడు దర్యాప్తునకు సిద్ధమనడం విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని పాక్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

Advertisements

ప్రాధాన్యం

ఉగ్రదాడిపై విచారణకు తాము సిద్ధమని పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ శనివారం ప్రకటించారు. తొలుత ఈ దాడిని పాకిస్తాన్ ఖండించిందని, భారత్‌పై నిందలు వేసిందని ఆయన గుర్తు చేశారు. పహల్గామ్‌లో జరిగిన దాడిని పాక్ గుర్తించలేదని ఒమర్ అబ్దుల్లా అన్నారు. మొదట ఈ దాడి వెనుక భారత్ ఉందని ఆరోపించారని ఆయన విమర్శించారు. మనపై ఆరోపణలు చేయడంలో ముందుండే వారికి ఇప్పుడేమీ చెప్పలేమని ఒమర్ అబ్దుల్లా అన్నారు. వారి ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ‘దురదృష్టకరమైన ఆ ఘటన జరిగి ఉండాల్సింది కాదు’ అని ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘటనతో తమ దేశంపై నిందలు వస్తున్నాయి’ అని అన్నారు. ‘విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం” అని షరీఫ్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అన్నారు.

 Phalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రదాడితో సంబంధం లేదన్న పాకిస్థాన్ స్పందించిన ఒమర్ అబ్దుల్లా

పుల్వామా

అమెరికా ప్రతిపాదనపై ఏకాభిప్రాయం రావడానికి ముందు అనేక చర్చలు జరిగాయి. పాకస్థాన్, చైనాతో కలిసి ప్రకటనలోని పదాలను మార్చడానికి ప్రయత్నించింది. గతంలో పుల్వామా, జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు దాడి వంటి ఉగ్రదాడులను మండలి ఖండించింది. స్థానిక ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. కానీ, ఐరాస ప్రకటనలో భారత ప్రభుత్వ ప్రస్తావన ఉంటే తమకు ఇబ్బంది తప్పదని పాక్ భావించింది. ఈ క్రమంలో పాక్ ప్రధాని దర్యాప్తునకు సిద్ధమని ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ఇక, సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. దాయాది కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చగొడుతోంది.

Read Also: US Presidnet: భారత్ పాక్ వివాదంపై డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Related Posts
White House: వచ్చే వారంలో వైట్ హౌస్‌లో ట్రంప్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు భేటీ
వచ్చే వారంలో వైట్ హౌస్‌లో ట్రంప్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు భేటీ

అమెరికా తెల్లజాతి దక్షిణాఫ్రికా వారిని శరణార్థులుగా తీసుకున్న తర్వాత వచ్చే వారం రామఫోసా,ట్రంప్ సమావేశమవుతారు. నల్లజాతి వారు ఎక్కువగా నివసించే ఈ దేశంలో తెల్లజాతి రైతులపై "జాతి Read more

Pahalgam : పహల్గాం ఉగ్రదాడిపై పాక్ కుట్ర అనుమానాలు వెల్లడి
కేంద్రం సంచల నిర్ణయం.. వాఘా బోర్డ‌ర్‌ను మూసివేసిన పాకిస్థాన్

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి, విదేశీ అతిథులు మరియు అగ్రనాయకులు భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో జరిగినందున, ఇది యాదృచ్ఛికం Read more

దుమారం రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలు
రిక్లైనర్లు, మసాజ్ కుర్చీలు కర్ణాటక స్పీకర్ వ్యాఖ్యలు దుమారం

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ యూటీ ఖాదర్‌ చేసిన తాజా ప్రతిపాదనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజా ప్రతినిధుల కోసం అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించిన Read more

బడ్జెట్‌ పై నిర్మలమ్మ కసరత్తులు..త్వరలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ
Nirmalamma exercises on the budget.meeting with the finance ministers of the states soon

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలాసీతారామన్‌ భేటి కానున్నట్లు సమాచారం. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×