Union Cabinet approves budget

బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం..

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు 2025-26 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా ఎనిమితోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె గుర్తింపు దక్కించుకోనున్నారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రికార్డును ఆమె సమం చేయనున్నారు.

Advertisements

కాగా, పార్లమెంట్‌లో బ‌డ్జెట్‌ 2025ను ప్రవేశపెట్టడానికి ముందు నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. బడ్జెట్ ను రాష్ట్రపతికి అందజేశారు. బడ్జెట్ లోని కీలక వివరాలను వివరించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి అనుమతి కోరారు. బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అనుమతిస్తూ రాష్ట్రపతి ముర్ము కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు స్వీటు తినిపించారు. రాష్ట్రపతితో సమావేశం ముగిసిన తర్వాత ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర మంత్రి పార్లమెంట్ కు చేరుకున్నారు. మరికాసేపట్లో లోక్ సభలో కేంద్ర మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు.

image

అంతకుముందు నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ‌ విభాగానికి వెళ్లిన నిర్మలమ్మ అక్కడి నుంచి బ‌హీఖాతా తీసుకువ‌చ్చారు. ఎరుపు రంగులో ఉన్న బ‌హీఖాతాలో బ‌డ్జెట్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే, వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం నుండి 6.8 శాతం మధ్య వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. కేంద్ర బడ్జెట్‌కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టిన ఈ సర్వే, దేశ ఆర్థిక ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయని పేర్కొంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్.. సూక్ష్మ, చిన్న,మధ్య తరహా సంస్థలు(ఎంఎస్ఎంఈలు), మూలధన వస్తువులపై దృష్టి సారించడం ద్వారా ప్రభుత్వం దీర్ఘకాలిక పారిశ్రామిక వృద్ధిని బలోపేతం చేయాలని యోచిస్తోందని పేర్కొంది.

Related Posts
3 రోజుల్లో రూ.216 కోట్లు విడుదల చేస్తాం: మంత్రి లోకేశ్
lokesh 2 300cr

ఇంజినీరింగ్ విద్యా రంగంలో నాణ్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం పూర్తి కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీల సంఘం Read more

పానీపూరి విక్రేతకు జీఎస్టీ నోటీసు
పానీపూరి విక్రేతకు జీఎస్టీ నోటీసు

తమిళనాడులో ఒక పానిపూరి విక్రేత తన ఆన్లైన్ చెల్లింపులు ఒక సంవత్సరంలో 40 లక్షల రూపాయలను దాటిన తర్వాత జీఎస్టీ నోటీసు అందుకున్నాడు. ఈ పానీపూరి విక్రేతకు Read more

Modi : ఎలాన్ మస్క్ ఫోన్ చర్చలు టెక్నాలజీపై కీలక అభివృద్ధి
Modi : ఎలాన్ మస్క్ ఫోన్ చర్చలు టెక్నాలజీపై కీలక అభివృద్ధి

Modi : ఎలాన్ మస్క్ ఫోన్ సంభాషణ – టెక్నాలజీ, వాణిజ్యంలో కీలక మలుపు భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు అమెరికా ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా Read more

నేడు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటన
CM Revanth Reddy visit to Karimnagar and Nizamabad districts today

కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ తరఫున విస్తృత ప్రచారం హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల Read more

Advertisements
×