rahul gandhi

రాహుల్ పై సభాహక్కుల ఉల్లంఘన

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్నీ ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీలు యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్బంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై సోమవారం లో క్ సభలో రాహుల్ మాట్లాడుతూ పదేపదే చైనా పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే .కాగా ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించడంతో లో క్ సభలో వాతావరణం వేడెక్కింది .

Advertisements
Rahul Gandhi Constitution Day Rahul Gandhi mic Rahul Gandhi microphone Rohith Vemula Rahul Gandhi speech backward classes

రాహుల్ తాను చేసిన ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు అందించడం లో విఫలమైతే ఆయన పై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది .కాగా ఇటీవల అగ్ర నాయకురాలు సోనియాగాంధి పై బీజేపీ ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు . పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభోపన్యాసం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌ పదిముర్ము చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ అభ్యంతరకర పదాలు వాడినందువల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.లో క్ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ . తయారీ రంగంలో భారత్ కంటే చైనా పదేళ్లు ముందుందన్నారు .ఆ దేశానికి చెందిన మోటర్లు , బ్యాటరీలు , ఆప్టికల్స్ దిగుమతుల పై ఇప్పటికి భారత్ ఆధారపడటాన్ని ఆయన తప్పుబట్టారు . ప్రధాని మోదీ చేపట్టిన ‘ మేక్ ఇన్ ఇండియా ‘ విఫలం కావడం వల్లే బీజింగ్ నుంచి వస్తువులు దేశంలోకి వస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Related Posts
CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు
CBI searches former CM Bhupesh Baghel house

CBI Raids: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు Read more

నకిలీ కాల్ సెంటర్‌ గుట్టురట్టు..63మంది అరెస్టు
నకిలీ కాల్ సెంటర్‌ గుట్టురట్టు..63మంది అరెస్టు

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది అంటే అరచేతిలో ఉండే ఫోన్ ద్వారా ఏదైన చిటికెలో చేసేయొచ్చు. అయితే అదే టెక్నాలజీతో పాటు సైబర్ మోసాలు కూడా ఎప్పటికప్పుడు Read more

నేడు జాతీయ యువజన దినోత్సవం
నేడు జాతీయ యువజన దినోత్సవం

1984లో, భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి ఈ వేడుక స్వామి వివేకానంద బోధనలు, తత్వశాస్త్రాలను గుర్తు చేస్తూ యువతకు ప్రేరణగా Read more

రన్యారావ్ ఇళ్లలో ED దాడులు..పెద్ద ఎత్తున బంగారం సీజ్
రన్యారావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి

కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు ముమ్మరం చేసింది. బెంగళూరులోని ఎనిమిది ప్రదేశాల్లో ఒకేసారి ఈ దాడులు నిర్వహించాయి. ఇందులో కోరమండలం Read more

Advertisements
×