పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో గాజా శ్మశానాన్ని తలపిస్తోంది. వేల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయడం, పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయడం జరుగుతోంది. అయితే, ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడంలో హమాన్ చాలా నెమ్మదిగా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ… శనివారంలోపు బందీలను అందరినీ ఓకేసారి విడుదల చేయాలని… లేకపోతే హమాస్ కు నరకం చూపిస్తానని హెచ్చరించారు.

ఒప్పందానికి కట్టుబడి వున్నాం
ఈ నేపథ్యంలో హమాస్ ప్రతినిధి సమీ అబు జుహ్రీ స్పందిస్తూ… శనివారం ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయబోమని చెప్పారు. అల్ జజీరాతో తో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో అంగీకరించిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని… ఒకేసారి బందీలను విడుదల చేసే ప్రసక్తే లేదని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని… అందుకే బందీల విడుదలలో జాప్యం జరుగుతోందని తెలిపారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పోరు
ఇజ్రాయెల్ దాడులతో గాజా భూభాగం శ్మశానంగా మారిన పరిస్థితి కొనసాగుతుండగా, హమాస్ బందీల విడుదల విషయంలో నెమ్మదిగా స్పందిస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
ట్రంప్ హెచ్చరిక – హమాస్ కు కఠిన వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారంలోగా బందీలను ఒకేసారి విడుదల చేయాలని, లేకపోతే హమాస్ కు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. హమాస్ వేగంగా చర్యలు తీసుకోకపోతే, మరింత మిలిటరీ ఒత్తిడి పెంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు. అల్ జజీరాతో జరిగిన ఇంటర్వ్యూలో, “ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, అందుకే బందీల విడుదలలో జాప్యం జరుగుతోందని” హమాస్ పేర్కొంది.