దేశంలోని నోట్ల వ్యవస్థలో మరో కొత్త అడుగు పడనుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్ కింద కొత్త రూ.20 నోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.ఈ New Currency Notesపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. ఇది ఆయన గవర్నర్గా నియమితుడైన తర్వాత మొదటిసారిగా విడుదల కాబోతున్న నోట్.

పాత డిజైన్తోనే కొత్త నోట్లు
New Currency Notes ఆర్బీఐ ప్రకారం, కొత్త నోట్ల డిజైన్ పెద్దగా మారదు. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.20 నోట్ల మాదిరిగానే ఉంటాయి. రంగు, పరిమాణం, డిజైన్ అన్నీ యథాతథంగా ఉంటాయి.వెనుక భాగంలో ఎల్లోరా గుహల చిత్రం కొనసాగుతుంది. అదే విధంగా సెక్యూరిటీ ఫీచర్లు కూడా యధాతధంగా ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇప్పటి వరకు చలామణిలో ఉన్న అన్ని రూ.20 నోట్లు చెల్లుబాటు అవుతాయి. గవర్నర్ సంతకం మారినా, నోట్ల విలువ తగ్గదు. ప్రజలు ఎలాంటి భయాందోళన పడవద్దని బ్యాంక్ పేర్కొంది.ఇది కేవలం కొత్త గవర్నర్ సంతకంతో కొత్త నోట్ల విడుదల మాత్రమేనని వివరించింది. సాధారణ ప్రక్రియగా చూస్తుండాలని పేర్కొంది.ఆర్బీఐ కొత్త గవర్నర్ వచ్చినప్పుడు కొత్త సంతకంతో నోట్లు రావడం సహజం. ఇది కరెన్సీ చరిత్రలో సాధారణ మార్పుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.గవర్నర్ సంతకం మారడమే తప్ప, నోట్ల అసలు విలువ మారదు. ఈ విషయం ప్రతి వినియోగదారుడికి తెలిసి ఉండాలి.
పబ్లిక్కు ఆర్బీఐ సూచన
కరెన్సీపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఆర్బీఐ సూచించింది. కొత్త నోట్లు వస్తే పాతవి రద్దవుతాయన్న వార్తలు నిరాధారమని తెలిపింది.ప్రస్తుత నోట్ల వినియోగంపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. సాధారణ లావాదేవీల్లో కొత్త, పాత నోట్లు సమానంగా చెలామణి అవుతాయని తెలిపింది.
ఇప్పటివరకు దేశంలో కొత్త నోట్ల ప్రయాణం
గతంలో రూ.500, రూ.2000 నోట్లు రద్దు తర్వాత చాలా మార్పులు వచ్చాయి. కొత్త డిజైన్తో పలు నోట్లు చలామణిలోకి వచ్చాయి.ఇప్పుడు అదే క్రమంలో రూ.20 నోట్లకు కూడా కొత్త రూపు వస్తోంది. అయితే అది డిజైన్ మాత్రమేనని, మార్పు మాత్రం పెద్దది కాదని అధికారులు చెబుతున్నారు.
Read Also : Jungle Safari Train : ఇండియాలో ఫస్ట్ విస్టాడోమ్ జంగిల్ సఫారీ ట్రైన్ ప్రారంభం..