సింగపూర్‌లో భారతీయ నిపుణులకు కొత్త అవకాశాలు – వీసా విధానాల్లో మార్పులు

సింగపూర్‌లో భారతీయ నిపుణులకు కొత్త అవకాశాలు – వీసా విధానాల్లో మార్పులు

అమెరికాలో ట్రంప్ సర్కార్ విదేశీ నిపుణులపై కఠినమైన వలస విధానాలు అమలు చేస్తున్న వేళ, సింగపూర్ మాత్రం భారతీయులకు సువర్ణావకాశం అందిస్తోంది. అక్కడి ప్రభుత్వం వీసా విధానాలను సవరించి, ఉద్యోగ వేతనాలను పెంచుతూ, నిపుణులకు దీర్ఘకాలిక పని అవకాశాలు కల్పిస్తోంది. ఓవైపు అమెరికాలో ట్రంప్ సర్కార్ విదేశీ నిపుణుల్ని వలసదారులుగా చూపుతూ తమ దేశం నుంచి తరిమేస్తున్న వేళ సింగపూర్ వీరికి ఆహ్వానం పలుకుతోంది. అమెరికా వలస విధానంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయుల్ని తమ దేశానికి వచ్చి ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఇందుకు తమ వీసా విధానాల్ని సైతం సవరిస్తోంది. అంతే కాదు ఇలా తమ దేశానికి వచ్చే భారతీయ నిపుణులకు ఇప్పటివరకూ చెల్లిస్తున్న జీతాల్ని సైతం పెంచుతోంది.

సింగపూర్‌లో భారతీయ నిపుణులకు కొత్త అవకాశాలు – వీసా విధానాల్లో మార్పులు


వర్క్ పర్మిట్ ఎంత కాలమైనా సింగపూర్ లో ఉండవచ్చు
ఈ ఏడాది జూలై నుంచి సింగపూర్ లో ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. దీని ప్రకారం వర్క్ పర్మిట్లు కలిగిన నిపుణులకు గరిష్ట పని కాల వ్యవధి నిబంధనను తొలగించబోతోంది. దీంతో విదేశీ నిపుణులు వర్క్ పర్మిట్ ఉంటే ఎంత కాలమైనా సింగపూర్ లో ఉండి పని చేసుకోవచ్చు. నిర్మాణ రంగం, ఓడల నిర్మాణం, తయారీ రంగంలో దీర్ఘకాలిక కెరీర్ కావాలనుకునే వారికి సింగపూర్ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతోంది. అలాగే ఇలా వచ్చే విదేశీ నిపుణుల పదవీ కాలాన్ని 63 ఏళ్లకు పెంచబోతోంది.
ఉద్యోగావకాశాలు పెంచాలని సింగపూర్ నిర్ణయం
మార్కెట్లో పోటీ తత్వం పెంచేందుకు వీలుగా మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ కు జీతాల్ని కూడా పెంచాలని నిర్ణయించింది. దీంతో భారతీయ నిపుణులకు కనీస వేతనం ఏడాదికి రూ.34.7 లక్షలకు పెంచుతోంది. దీన్ని జనవరి 2025 నుంచే వర్తింప చేయబోతోంది. అలాగే ఆర్ధిక వ్యవహారాల నిపుణులకు కనీస వేతనం ఏడాదికి రూ.38.4 లక్షలుగా నిర్ణయించింది.

Related Posts
తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం
mayonnaise

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంటూ మయోనైజ్‌పై నిషేధం విధించింది. మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై ఒక సంవత్సరం పాటు నిషేధం విధిస్తున్నట్లు Read more

జగన్ 2.0 వ్యాఖ్యలపై సోమిరెడ్డి రియాక్షన్
నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా "2.0" అనే పదం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ కొత్త నినాదంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి Read more

చంద్రబాబు ట్వీట్తో తెలుగు-తమిళుల మధ్య మాటల యుద్ధం!
CBN tweet viral

వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు విజయాన్ని ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. ట్వీట్లో గుకేశ్ తెలుగువాడని పేర్కొనడంపై తమిళ నెటిజన్లు Read more

బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు..దుర్మార్గమైన చర్య: హరీశ్‌ రావు
Government is fully responsible for this incident: Harish Rao

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరిగిపోతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారు. ఈ క్రమంలోనే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *