New MLCs to be sworn in today

Telangana : నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

Telangana : ఇటీవల తెలంగాణ రాష్ట్ర శాసనమండలి వేదికగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఈరోజు ప్రమాణ్య స్వీకారం చేయనున్నారు. పట్టభద్రులు, టీచర్‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల మధ్య నిర్వహించనున్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్సీలు నూతనంగా ఎన్నికయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

Advertisements
నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ

బీఆర్‌ఎస్‌ నుంచి దాసోజు శ్రవణ్‌ ఏకగ్రీవంగా ఎన్నిక

ఇందులో భాగంగా.. ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్‌, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్‌ఎస్‌ నుంచి దాసోజు శ్రవణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్‌ పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య విజయం సాధించారు. అలానే ఖమ్మం టీచర్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఇక, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, శ్రీపాల్‌రెడ్డి ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. వీరు మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts
కాంగ్రెస్ వచ్చింది-కష్టాలు తెచ్చింది – కేటీఆర్ ట్వీట్
KTR tweet on the news of the arrest

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా, "కాంగ్రెస్ పాలన రాష్ట్రాన్ని వణికించుకుంటూ, ధర్నాల ద్వారా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు" Read more

ఆస్ట్రేలియా బీచ్‌లో 3,500 కిమీ దూరం నుంచి వచ్చిన పెంగ్విన్..
penguin

ప్రకృతి ప్రపంచంలో అనేక అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు అసాధారణ సంఘటనలు కూడా ఎదురుకావచ్చు. ఇటీవలి సందర్భంలో ఒక పెంగ్విన్ ఆస్ట్రేలియాలోని కోకోస్ బీచ్‌పై కనిపించింది. ఇది చాలా Read more

Supreme Court: కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court: కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివాదాస్పద భూవిషయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు Read more

‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌
Pawan Kalyan started the Palle Festival programme

కంకిపాడు: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కృష్ణా జిల్లా కంకిపాడులో 'పల్లె పండుగ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×