West Bengal: పశ్చిమ బెంగాల్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రపతి పర్యటనలో కనీస ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఆయన మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అన్ని హద్దులు దాటి ప్రవర్తించిందని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని విమర్శించారు.
Read Also: Punjab lottery news : రూ.50 టికెట్కు రూ.30 లక్షలు కానీ విజేత ఎక్కడ?
ఇది సిగ్గుచేటు విషయమని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, గిరిజన వర్గాల సాధికారతపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరి నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేలా మమతా బెనర్జీ చర్య ఉందని ఆరోపించారు. మమతా బెనర్జీ తీరుతో గిరిజన వర్గానికి చెందిన రాష్ట్రపతి పడిన ఆవేదన దేశ ప్రజల మనసుల్లో అపార దుఃఖాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: