నదియా జిల్లాలో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేర్పారా ప్రాంతానికి చెందిన బాపన్ షేక్ అనే వ్యక్తి తన భార్య మధు ఖాతూన్ ముక్కు అందంగా ఉందన్న కారణంతో దాన్ని కొరికి తినేంతవరకూ వెళ్లాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 3 గంటల సమయంలో జరిగింది. మధు నిద్రపోతుండగా బాపన్ ఆమె ముక్కును కొరికి, రక్తస్రావం అయ్యేలా చేశాడు. గాఢ నిద్రలో ఉన్న భార్య ఒక్కసారిగా రక్తస్రావంతో లేచి, భయాందోళనతో బయటకు పరుగులు తీసింది.ఆమె బయటకు పరుగులు తీసిన తరువాత కూడా బాపన్ షేక్ వదలకుండా వెంటపడి, ఆమె వేలిని గట్టిగా కొరికాడు. ఈ దారుణ చర్యలతో గాయపడిన మధు ఖాతూన్ తల్లి రేష్మాబేగంతో కలిసి శాంతిపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో తన భర్త తరచూ మద్యం తాగి వస్తూ, తన అందాన్ని ప్రశంసిస్తూ “నీ ముక్కు చాలా బాగుంది. దాన్ని తినేస్తాను” అనే భయానక వ్యాఖ్యలు చెబుతుండేవాడని పేర్కొంది. నిజంగా ఒక్క రోజు ఆ వ్యాఖ్యలను నిజం చేస్తూ, రాత్రి నిద్రిస్తున్న సమయంలో తనపై దాడి చేశాడని ఆమె వెల్లడించారు.
West Bengal : భార్య ముక్కు అందంగా ఉందనికొరికి తినేసిన భర్త
ఈ కేసు ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బాపన్ షేక్ను అరెస్టు చేసి రాణాఘాట్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం పోలీసులు నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టును కోరారు. మధు ఖాతూన్ తల్లి రేష్మా బేగం మాట్లాడుతూ, “నా కూతురిపై అల్లుడు అమానుషంగా ప్రవర్తించాడు. మధు అరుపులతో మెలకువ వచ్చి చూస్తే, ఆమె ముక్కు, వేలు రక్తస్రావం అవుతున్నాయి. దాడి సమయంలో నన్నూ వదలలేదు. ఇంత దారుణంగా ప్రవర్తించిన వ్యక్తికి కఠిన శిక్ష అవసరం,” అని పేర్కొన్నారు.ఇలాంటి ఘటనలు మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మానసిక స్థితి లోపించిందా లేదా అనేదానిపై కూడా పోలీసులు వైద్యపరీక్షలు జరిపే అవకాశం ఉంది. బాధితురాలికి న్యాయం జరిగేలా, నిందితుడికి సరైన శిక్ష పడేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి.
Read More : NIA: ఉగ్రదాడిలో ముష్తాక్ అహ్మద్ జర్గర్ పాత్రపై దర్యాప్తు