हिन्दी | Epaper

Vaishno Devi Temple: తుపాకీతో వైష్ణోదేవి ఆల‌యంలోకి ప్రవేశించిన మహిళ

Sharanya
Vaishno Devi Temple: తుపాకీతో వైష్ణోదేవి ఆల‌యంలోకి ప్రవేశించిన మహిళ

జమ్మూలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ పవిత్ర స్థలంలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన తరుణంలో ఓ మహిళ తుపాకీతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ నెల 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు, సమాచారం బయటకు రావడంతో భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి.

Vaishno devi 1

వైష్ణోదేవి ఆలయంలో భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి భక్తుడినీ పూర్తి తనిఖీ చేసి, అనుమానాస్పదంగా కనిపించే వారిని సెక్యూరిటీ తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ నెల 15న ఓ మహిళ భద్రతా సిబ్బందిని మోసం చేసి తుపాకీతో ఆలయంలోకి ప్రవేశించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తుండగా, ఆమె ఒక కుదుపుతో తనిఖీ నుంచి తప్పించుకుని ముందుకు సాగింది. తర్వాత భక్తులతో కలిసి మెల్లగా ఆలయ ప్రాంగణంలోకి వెళ్లి కొంత సేపు గడిపింది. అయితే, కొంత సమయం గడిచిన తర్వాత ఆమె వద్ద తుపాకీ ఉందని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం ఆమె వద్ద ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మహిళ ఎవరికి సంబంధించింది?

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆమె పేరు జ్యోతి గుప్తా అని తేలింది. ఆమె ఢిల్లీ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న అధికారి అని గుర్తించారు. అయితే, ఆమె వద్ద ఉన్న తుపాకీ లైసెన్స్ గడువు ముగిసినదిగా పోలీసులు తెలిపారు. దీని కారణంగా ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

భద్రతా వైఫల్యంపై భక్తుల ఆగ్రహం

ఈ ఘటన ఆలయ భద్రతా వ్యవస్థపై పెద్ద నిర్భంధాన్ని తెచ్చింది. ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించే ప్రతి భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఈ ఘటన జరగకపోయేది. కానీ, మహిళ భద్రతా సిబ్బందిని తప్పించుకుని తుపాకీతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగలిగిందంటే సెక్యూరిటీ వ్యవస్థలో లోపాలున్నాయనే అనుమానం కలుగుతోంది. భక్తులు దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ తుపాకీతో ఆలయంలోకి ప్రవేశించగలిగితే, ఉగ్రవాదులు, దుండగులు కూడా ఏదైనా దాడికి పాల్పడగలరు. ఇది భద్రతాపై తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనం అని భక్తులు విమర్శిస్తున్నారు. వైష్ణోదేవి ఆలయం హిందువుల ముఖ్య పవిత్ర స్థలాల్లో ఒకటి. ఇలాంటి ప్రదేశాల్లో భద్రతను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. ఒక మహిళ తుపాకీతో ఆలయంలోకి ప్రవేశించడం ఒక ప్రమాదకరమైన ఉదాహరణ. భద్రతా సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిపూర్ణమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై ప్రభుత్వం, భద్రతా అధికారులు దర్యాప్తు చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. భక్తుల భద్రతకే పెద్దపీట వేసి, భద్రతను మరింత పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870