సైనికులు అంటే దేశాన్ని కాపాడేవారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. దేశసరిహద్దులో నిరంతరం కాపలా కాస్తుంటారు. యుద్ధం కోసం ఏ క్షణంలో చేసేందుకైనా సిద్ధంగా ఉంటారు. సరిహద్దు దేశాలు అక్రమంగా భారత్లో జొరపడకుండా గడ్డకట్టిన మంచులో సైతం రాత్రీపగలు కాపలా కాస్తుంటారు. వారు కాపలా కాయడం బట్టే
కదా మనం హాయిగా జీవించగలుగుతున్నాం. సైనికులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి సేవలు అద్భుతం. ఎందుకు ఇదంతా చెబుతున్నారని అనుకుంటున్నారా? సైనికులను గౌరవించాల్సింది పోయి వారిపై దాడికి పాల్పడే వారిని ఏమనాలి? ఎక్కడని అంటారా అయితే ఆ వివరాలు ఏమిటో మీరే చదవండి.

ఆర్మీ జవాన్ పై దాడి
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని మేరఠ్ టోల్ గేట్ (Meerut Toll Gate) వద్ద ఆర్మీ జవాన్ పై టోల్ గేట్ సిబ్బంది కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఇందుకు కారణం అతను ఆ సిబ్బందిని ప్రశ్నించడమే. సెలవుల అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్తూ, టోల్ గేట్ వద్ద ఆలస్యాన్ని జవాన్ కపిల్ ప్రశ్నించడంతో సిబ్బంది దాడికి పాల్పడింది. రాజ్పుత్ రెజిమెంట్లో సైనికుడిగా పని చేస్తున్న బాధిత ఆర్మీ జవాన్ కపిల్ కవాడ్ (Jawan Kapil Kawad) పై మేరర్ టోల్ గేట్ వద్ద సిబ్బంది కర్రలతో విచాక్షణారహితంగా దాడి చేశారు. గాయపడ్డ కపిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాడికి పాల్పడ్డ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాచారం తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: