हिन्दी | Epaper

Uttar Pradesh: పార్టీ అధ్యక్షుడికి దండవేసి చెంప చెళ్లుమనిపించిన కార్యకర్త

Ramya
Uttar Pradesh: పార్టీ అధ్యక్షుడికి దండవేసి చెంప చెళ్లుమనిపించిన కార్యకర్త

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. సుహెల్‌దేవ్ స్వాభిమాన్ పార్టీ (ఎస్‌ఎస్‌పీ) జాతీయ అధ్యక్షుడు మహేంద్ర రాజ్‌భర్‌పై అదే పార్టీకి చెందిన ఒక కార్యకర్త బహిరంగ వేదికపైనే దాడికి పాల్పడ్డాడు. తొలుత దండ వేసి సత్కరించిన కార్యకర్త, ఆ మరుక్షణమే మహేంద్ర రాజ్‌భర్‌ చెంపపై పలుమార్లు కొట్టడం అక్కడున్న వారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వేదికపై దాడి, సభలో గందరగోళం

ఈ సంఘటన మహారాజా సుహెల్‌దేవ్ విజయ దినోత్సవం సందర్భంగా జలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశాపుర్ గ్రామంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజ్‌భర్ వర్గం అధికంగా ఉండే జఫరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుహెల్‌దేవ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేసేందుకు ఈ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మౌ జిల్లాకు చెందిన మహేంద్ర రాజ్‌భర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రసంగించేందుకు ఆయన వేదికపైకి రాగానే, బ్రిజేష్ రాజ్‌భర్ అనే పార్టీ కార్యకర్త ముందుగా ఆయనకు దండ వేశాడు. ఆ వెంటనే మహేంద్ర రాజ్‌భర్ చెంపలపై కొట్టాడు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

మహేంద్ర రాజ్‌భర్ ఫిర్యాదు, ఆరోపణలు

ఈ దాడి జరిగిన వెంటనే మహేంద్ర రాజ్‌భర్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి జలాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో బ్రిజేష్ రాజ్‌భర్‌పై ఫిర్యాదు చేశారు. దాడి వెనుక ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి సుహెల్‌దేవ్, భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. “బ్రిజేష్ నాలుగు, ఐదు రోజుల క్రితం ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌ను కలిశాడు. ఆయన ఆదేశాలతోనే ఈ దాడి జరిగింది” అని మహేంద్ర రాజ్‌భర్ విలేకరులతో చెప్పారు. బ్రిజేష్ గతంలో తన పార్టీలో కార్యకర్తగా ఉండేవాడని, ప్రస్తుతం అతనికి ఎలాంటి పదవి లేదని, అతడిని ఎవరు కార్యక్రమానికి ఆహ్వానించారో కూడా తనకు తెలియదని తెలిపారు. పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలుగానీ, ఆర్థికపరమైన వివాదాలుగానీ లేవని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ నేపథ్యం, పోలీసుల దర్యాప్తు

గతంలో మహేంద్ర రాజ్‌భర్, ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌కు చెందిన ఎస్‌బీఎస్‌పీలో జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ సిద్ధాంతాల నుంచి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ వైదొలిగి, వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన సొంతంగా సుహెల్‌దేవ్ స్వాభిమాన్ పార్టీని స్థాపించారు. మహేంద్ర రాజ్‌భర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు జలాల్‌పూర్ ఎస్‌హెచ్‌ఓ త్రివేణి సింగ్ తెలిపారు.

ప్రతిస్పందనలు, భవిష్యత్ పరిణామాలు

ఈ ఆరోపణలపై ఓం ప్రకాశ్ రాజ్‌భర్ లేదా ఎస్‌బీఎస్‌పీ నుంచి ఈ ఆరోపణలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఈ దాడి ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఇది ‘పీడీఏ’ (పిచ్‌డే – వెనుకబడిన తరగతులు, దళితులు, అల్పసంఖ్యాక్ – మైనారిటీలు) వర్గాలపై జరుగుతున్న దాడులు, అవమానాలకు మరో నిదర్శనమని, దీని వెనుక బీజేపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

Read also: Pakistan: దేశ భద్రత కోసం రక్షణ బడ్జెట్‌ను అమాంతం పెంచేసిన పాక్!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870