हिन्दी | Epaper

Breaking News – Airindia: ఎయిన్ఇండియా విమానంలో కలకలం

Sudheer
Breaking News – Airindia: ఎయిన్ఇండియా విమానంలో కలకలం

బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు పొరపాటున కాక్‌పిట్ డోర్ తెరవడానికి ప్రయత్నించడంతో ప్రయాణికులు, సిబ్బందిలో ఆందోళన నెలకొంది. విమాన ప్రయాణంలో ఇలాంటి సంఘటన జరగడంతో భద్రతా సమస్య తలెత్తుతుందనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో ఆ ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్‌ను టాయిలెట్ తలుపు అనుకుని తెరవడానికి ప్రయత్నించాడని, ఎటువంటి భద్రతా సమస్య తలెత్తలేదని స్పష్టంచేశారు. విమాన సిబ్బంది సమయానికి జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదని వివరించారు. విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులు ఆందోళన చెందవద్దని, పరిస్థితి పూర్తిగా సురక్షితంగానే ఉందని కంపెనీ భరోసా ఇచ్చింది.

అయితే, నియమ నిబంధనల ప్రకారం ఆ ప్రయాణికుడిని CISF అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నిర్లక్ష్యం పెద్ద సమస్యకు దారి తీసే అవకాశం ఉన్నందున విచారణ జరపనున్నట్లు సమాచారం. విమాన ప్రయాణాల్లో కాక్‌పిట్ భద్రత అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం కావడంతో, ఇలాంటి చిన్నపాటి తప్పిదాలను కూడా అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. ఈ ఘటన, ప్రయాణికులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.

https://vaartha.com/cabinet-meeting-on-october-3/breaking-news/552361/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870