हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Tigers Dead: కర్ణాటకలో ఐదు పులులు అనుమానాస్పద స్థితిలో మృతి

Sharanya
Tigers Dead: కర్ణాటకలో ఐదు పులులు అనుమానాస్పద స్థితిలో మృతి

కర్ణాటక (Karnataka) లోని ప్రసిద్ధ మలె మహదేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో ఇటీవల వెలుగుచూసిన విషాదకర ఘటన. ఒక తల్లి పులి, దాని నాలుగు పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. ఈ దుర్ఘటనకు విషప్రయోగమే ప్రధాన కారణమై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణను ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

సంఘటన పూర్తి వివరాలు:

చామరాజనగర్ (Chamarajanagar) జిల్లాలోని మలె మహదేశ్వర హిల్స్‌ పరిధిలోని హుగ్యం రేంజ్‌, కథనం ప్రకారం అడవి సమీపంలో మేస్తున్న ఒక ఆవును ఈ పులి చంపి, దాని కళేబరాన్ని అడవిలోకి లాక్కెళ్లింది. ఆవు కళేబరాన్ని గమనించిన స్థానిక పశువుల కాపరులు, ప్రతీకారంతో దానిలో విషం కలిపి ఉండవచ్చని భావిస్తున్నారు. అనంతరం ఆ కళేబరాన్ని తినడానికి వచ్చిన తల్లి పులి, దాని పిల్లలు విష ప్రభావంతో మృత్యువాత పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

విచారణ, చర్యలు:

అటవీ శాఖ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఈ ఘటనపై విచారణ చేపట్టాయి. పులి చంపిన ఆవు కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, దాని యజమానిని గుర్తించేందుకు శుక్రవారం గాలింపు చర్యలు ప్రారంభించారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్‌టీసీఏ) మార్గదర్శకాల ప్రకారం, పులి పిల్లలకు శుక్రవారం, తల్లి పులికి గురువారమే పోస్టుమార్టం పూర్తి చేశారు.

బి.వై. విజయేంద్ర స్పందన:

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. “మహదేశ్వరుని వాహనంగా పులిని పూజించే పవిత్ర మలె మహదేశ్వర కొండల్లో ఒకేసారి ఐదు పులులు మరణించడం అత్యంత అమానుషం, దిగ్భ్రాంతికరం” అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విష ప్రయోగమే ఈ మరణాలకు కారణమైతే, ఇది అత్యంత హేయమైన, ఖండించదగిన చర్య అని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం నిజానిజాలను త్వరితగతిన నిగ్గు తేల్చి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ సంఘటనపై మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పందిస్తూ

అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ సంఘటనపై స్పందిస్తూ, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించామని, మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. దేశంలోనే పులుల సంఖ్యలో కర్ణాటక (563) రెండో స్థానంలో ఉందని, ఇలాంటి రాష్ట్రంలో ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మలె మహదేశ్వర అభయారణ్యం గురించి:

ఈ అభయారణ్యం సుమారు 906 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది పులులు, ఏనుగులు, చిరుతలు, గొర్రెలు, హరిణాలు, బట్టమేకలు వంటి అనేక అరుదైన వన్యప్రాణులకు నివాసంగా ఉంది. తక్కువ సంఖ్యలో మాత్రమే కనిపించే కొన్ని రకాల పక్షులు, మొక్కలు, జంతువులు ఇక్కడ సులభంగా కనిపిస్తాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ అభయారణ్యం పర్యాటకంగా కూడా ప్రసిద్ధి చెందింది.

Read also: Jagannath Rath Yatra: పూరీలో ఘనంగా ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870