దావోస్లో జరిగిన ‘కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్‘ సమావేశంలో ఒకే వేదికపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సమావేశానికి హాజరై తమ రాష్ట్రాల ప్రగతి, పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్వహించింది. దేశాన్ని ఒక యూనిట్గా చూపిస్తూ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సమావేశం కేంద్రంగా నిలిచింది. రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక రంగం, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రక్షణ రంగాల్లో పెట్టుబడులపై చర్చ జరిగింది.
రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్టులను, పరిశ్రమల అభివృద్ధిని వివరించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పురోగతి, ఆవిష్కరణలు, నూతన సాంకేతికతపై దృష్టి పెట్టడం గురించి మాట్లాడారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రలో ఉన్న పారిశ్రామిక పెట్టుబడుల అవకాశాలను ప్రపంచం ముందు ఉంచారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ-తమ రాష్ట్రాల ప్రాధాన్యతలను వివరించడంతో పాటు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించగలిగారు. దావోస్ వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలిసి కనిపించడం రాజకీయంగా కూడా విశేషమైన పరిణామంగా విశ్లేషించబడుతోంది. ఇలాంటి అంతర్జాతీయ వేదికలు పెట్టుబడిదారులతో రాష్ట్రాల నేరుగా సంబంధాలు పెంచడానికి ఉపయోగపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.