పాకిస్తాన్పై జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)అనంతరం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి భారత్ గట్టి దెబ్బ కొట్టిందని, పాక్ (Pak) లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం మిస్సైళ్ల దాడులు జరిపిందని వివరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని కుటుంబ సభ్యుల సమక్షంలోనే అమానుషంగా హత్యలు చేయించిందని, ఆ దారుణ చర్యపై దేశం మొత్తం ఒక్కటై నిలబడిందని చెప్పారు.
మహిళల సిందూరాన్ని తొలగిస్తే ఏం జరుగుతుందో చూపించాం
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ “దేశంలోని మహిళల సిందూరాన్ని తొలగిస్తే ఏం జరుగుతుందో చూపించాం” అంటూ భావోద్వేగంతో పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన భద్రతా బలగాలకు వందనం చేస్తున్నానని, మన సైన్యం అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. బావల్పూర్, మురిద్కే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలు ఉగ్రవాద యూనివర్శిటీలుగా మారాయని, అందుకే వాటిపై క్షిపణి దాడులు జరిగాయని వివరించారు.
పాకిస్తాన్ యుద్ధ భూముల్లో వణికిపోయింది
పాక్ నుంచి వచ్చే మిస్సైల్స్, డ్రోన్లు భారత రక్షణ వ్యవస్థకు మట్టికరవయ్యాయని, పాకిస్తాన్ యుద్ధ భూముల్లో వణికిపోయిందని మోదీ స్పష్టం చేశారు. భారత్ ఎప్పుడూ “నేషన్ ఫస్ట్” అనే నినాదంతో ముందుకు వెళ్లిందని, సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు గుణపాఠం చెప్పామన్నారు. చర్చలు ఉంటే అవి పీవోకే గురించి మాత్రమేనని… ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇచ్చే పాక్తో ఇక మోసపోవడం లేదని స్పష్టం చేశారు.
Read Also : India – Pakistan War : పాకు ఆయుధాలు ఇవ్వలేదు – చైనా