हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Elections: ఎన్నికల్లో 3 కీలక చర్యలు ప్రకటించిన కమిషన్

Anusha
Elections: ఎన్నికల్లో 3 కీలక చర్యలు ప్రకటించిన కమిషన్

భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసే దిశగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక అడుగులు వేసింది.ఓటర్లకు అందించే సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా మూడు ప్రధాన సంస్కరణలను ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిల నేతృత్వంలో జరిగిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల (సిఈఓ) సమావేశం అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఈసీఐ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.

జాబితా

ఓటర్ల జాబితాలో తరచూ తలెత్తే సమస్యల్లో ఒకటైన మరణించిన వారి పేర్లను సమర్థవంతంగా తొలగించేందుకు ఈసీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద నమోదైన మరణాల వివరాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నేరుగా సేకరిస్తారు. ఈ సమాచారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు (ఈఆర్ఓ) అందుతుంది. అనంతరం బూత్ లెవల్ అధికారులు (బిఎల్ఓ) క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆ వివరాలను ధృవీకరించుకుంటారు. దీనివల్ల, ఫారం 7 ద్వారా అధికారికంగా దరఖాస్తు అందే వరకు వేచి చూడకుండా, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి సత్వరమే తొలగించడానికి వీలవుతుంది. 1960 నాటి ఓటర్ల నమోదు నిబంధనల్లోని రూల్ 9, జనన మరణాల నమోదు చట్టం-1969 (2023 సవరణ) లోని సెక్షన్ 3(5)(బి)లకు అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు ఈసీఐ తెలిపింది. ఈ చర్యతో ఓటర్ల జాబితా మరింత కచ్చితంగా మారుతుందని భావిస్తున్నారు.

 Elections: ఎన్నికల్లో  3 కీలక చర్యలు ప్రకటించిన కమిషన్

పోలింగ్

ఓటర్లకు పోలింగ్ కేంద్రం, ఇతర వివరాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఓటర్ సమాచార స్లిప్ (విఐఎస్) ను ఈసీఐ పునఃరూపకల్పన చేసింది. కొత్త స్లిప్పులో ఓటరు సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ వంటి వివరాలను పెద్ద అక్షరాలతో ముద్రిస్తారు. దీనివల్ల ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్‌ను తేలికగా గుర్తించడంతో పాటు, పోలింగ్ అధికారులు కూడా ఓటర్ల జాబితాలో వారి పేరును వేగంగా కనుగొనడానికి వీలవుతుందని ఈసీఐ పేర్కొంది.ఓటర్లకు, ఎన్నికల సంఘానికి మధ్య వారధిగా పనిచేసే బూత్ లెవల్ అధికారుల (బిఎల్ ఓ) పనితీరును మరింత మెరుగుపరిచేందుకు, వారికి ప్రజల్లో గుర్తింపు పెంచేందుకు ఈసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 13బి(2) కింద నియమితులైన బీఎల్వోలందరికీ ఇకపై ప్రామాణిక ఫోటో గుర్తింపు కార్డులను జారీ చేయాలని ఆదేశించింది. ఇంటింటి సర్వే, ఓటరు నమోదు, పరిశీలన వంటి కార్యక్రమాల సమయంలో బీఎల్వోలను ప్రజలు సులభంగా గుర్తించేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయని, తద్వారా వారి మధ్య విశ్వాసం పెరిగి, ఎన్నికల ప్రక్రియ మరింత సజావుగా సాగుతుందని ఈసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది.

Read Also: PM Modi: ప్రతిభ, సృజనాత్మకతలకు వేవ్స్‌ పునాది: ప్రధాని మోదీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్రగ్స్ కేసులో నటి అరెస్ట్?

డ్రగ్స్ కేసులో నటి అరెస్ట్?

తమిళ సాహిత్యం పై మోడీ ప్రశంసలు

తమిళ సాహిత్యం పై మోడీ ప్రశంసలు

3 వారాల్లో నిర్ణయం లేకపోతే చర్యలు, స్పీకర్‌కు సుప్రీం హెచ్చరిక!

3 వారాల్లో నిర్ణయం లేకపోతే చర్యలు, స్పీకర్‌కు సుప్రీం హెచ్చరిక!

1980లోనే ఓటరు జాబితాలోకి నా పేరు చేరలేదు: సోనియా

1980లోనే ఓటరు జాబితాలోకి నా పేరు చేరలేదు: సోనియా

ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి

ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

అమెరికా డీల్ తో రష్యాకు చెక్ కష్టమేనా ?

అమెరికా డీల్ తో రష్యాకు చెక్ కష్టమేనా ?

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

బాలీవుడ్‌ను వణికిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’

బాలీవుడ్‌ను వణికిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’

నేను సీఎం ఎప్పుడు అవుతానో కాలమే చెబుతుంది: శివకుమార్‌

నేను సీఎం ఎప్పుడు అవుతానో కాలమే చెబుతుంది: శివకుమార్‌

UTS యాప్‌ సేవలు బంద్.. RailOne కి మారాలని కీలక సూచన

UTS యాప్‌ సేవలు బంద్.. RailOne కి మారాలని కీలక సూచన

📢 For Advertisement Booking: 98481 12870