हिन्दी | Epaper

NPCI:ఇనాక్టివ్ నెంబర్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

Anusha
NPCI:ఇనాక్టివ్ నెంబర్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం ఇనాక్టివ్ (క్రియాశీలంగా లేని) మొబైల్ నంబర్ల విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలను అటువంటి నంబర్లకు నిలిపివేయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది.ఈ నిర్ణయం అన్ని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌లకు) వర్తించనుంది.

ప్రధాన కారణాలు

యూపీఐ లావాదేవీల భద్రతను పెంచడం, మోసాలను నిరోధించడం ఈ చర్యకు ప్రధాన కారణాలు. యూపీఐ సేవలు ప్రధానంగా మొబైల్ నంబర్‌పై ఆధారపడతాయి.టెలికాం సంస్థలు పాత మొబైల్ నంబర్లను తిరిగి కొత్త వినియోగదారులకు కేటాయిస్తుంటాయి.దీని వలన ఆ నంబర్లతో లింక్ అయిన పాత యూపీఐ ఖాతాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది.ఓటిపి ధృవీకరణ వంటి భద్రతా విధానాలు మొబైల్ నంబర్‌తో పనిచేస్తాయి.ఇనాక్టివ్ నంబర్లను తొలగించకపోతే అధికార ఖాతాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.

వినియోగదారులు

ఈ నిర్ణయం కింది విభాగాల వినియోగదారులపై ప్రభావం చూపుతుంది:కొన్ని నెలల నుంచి తమ యూపీఐ లింక్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించని వారు.పాత మొబైల్ నంబర్‌ను మార్పిడి చేసి బ్యాంక్ రికార్డుల్లో అప్‌డేట్ చేయనివారు.తమ పాత నంబర్‌ను సరెండర్ చేసి కొత్త నంబర్ తీసుకున్నా, బ్యాంక్‌లో మార్పు నమోదు చేయని వారు.

యూపీఐ సేవలు నిలిచిపోకుండా ఉండాలంటే

మీ యూపీఐ అకౌంట్ నిరవధికంగా నిలిపివేయబడకుండా ఉండాలంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి:మీ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో ధృవీకరించుకోండి. మీ బ్యాంకు నుంచి ఓటిపి ఎస్‌ఎంఎస్ లేదా అలెర్ట్స్ వస్తున్నాయా అని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.యూపీఐ లావాదేవీలు సజావుగా జరిగేలా, బ్యాంకు రికార్డుల్లో మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయించండి.నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా నేరుగా బ్యాంకును సందర్శించి మీ నంబర్‌ను వెరిఫై చేయించుకోండి.గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్‌లను ఓపెన్ చేసి మీ అకౌంట్ యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేయండి.

Smartphone Users ShutterStock 1

అప్‌డేట్

యూపీఐ సేవలు సురక్షితంగా ఉండాలంటే ఈ మార్గదర్శకాలను పాటించాలి.ఇనాక్టివ్ మొబైల్ నంబర్లను తొలగించడం వల్ల భద్రత పెరుగుతుంది, మోసాలను నివారించొచ్చు.ఏప్రిల్ 1, 2025నుంచి ఈ మార్గదర్శకాలు అమలులోకి రానున్నందున, వెంటనే మీ బ్యాంక్ డిటైల్స్ అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం.మొబైల్ నంబర్ మార్చిన తర్వాత బ్యాంక్ రికార్డులను పునరుద్ధరించనివారిపై, యూపీఐ తో లింక్ చేసిన నంబర్లను ఉపయోగించని వారిపై, అలాగే తమ పాత నంబర్లను సరెండర్ చేసిన వారిపై కేంద్రం తాజా నిర్ణయం ప్రభావం చూపుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

స్టైఫండ్ ఎగ్గొట్టిన కాలేజీలకు జరిమానా విధించిన ఎన్ఎంసీ

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

📢 For Advertisement Booking: 98481 12870