हिन्दी | Epaper

TG: పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Anusha
TG: పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణ (TG) అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల అంశంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీజేపీ నేత, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం న్యాయస్థాన పరిధిలోకి వెళ్లింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

Read Also: Siddipet: కుటుంబ కలహాలతో భార్య గొంతు కోసిన భర్త

TG: Party defections case.. Supreme Court notices to Speaker
TG: Party defections case.. Supreme Court notices to Speaker

ఫిబ్రవరి 6న విచారణ

మహేశ్వర్‌రెడ్డి చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. అనంతరం ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి, కేటీఆర్‌ల పిటిషన్లతో జత చేసింది. ఈ పిటిషన్లన్నింటిపైనా కలిపి ఫిబ్రవరి 6న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870