Tarun Murder Case: దేశ రాజధాని ఢిల్లీలో హోలీ వేడుకలు తీవ్ర విషాదాన్ని నింపాయి. చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో జరిగిన ఒక చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒక యువకుడి ప్రాణం తీయడమే కాకుండా ఉద్రిక్తతలకు దారితీసింది.

ఘటనా నేపథ్యం
మార్చి 4, 2026న హోలీ పండుగ సందర్భంగా తరుణ్ అనే యువకుడి బంధువుల ఇంట్లో 11 ఏళ్ల బాలిక నీటి బెలూన్లతో ఆడుకుంటోంది. ఆ క్రమంలో ఒక బెలూన్ పొరుగున ఉన్న మరో వర్గానికి చెందిన మహిళపై పడింది. ఈ చిన్న కారణంతో మొదలైన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. నిందితులు గుంపుగా వచ్చి తరుణ్ కుటుంబంపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించిన తరుణ్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
ఆరుగురి అరెస్ట్
ఈ హత్యోదంతంపై ఢిల్లీ పోలీసులు వేగంగా స్పందించారు. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా, ఒక మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) ను రంగంలోకి దింపింది. ప్రస్తుతం అక్కడ భారీ భద్రత కట్టుదిట్టం చేశారు.
బుల్డోజర్ల చర్య
తరుణ్ మృతితో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితుల అక్రమ నిర్మాణాలను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) అధికారులు ఇప్పటికే కూల్చివేసినట్లు సమాచారం. తన కుమారుడి మరణంపై CBI దర్యాప్తు జరిపించాలని తరుణ్ తండ్రి డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో #JusticeForTarun అనే హ్యాష్ట్యాగ్తో నెటిజన్లు నిందితులకు ఉరిశిక్ష వేయాలని కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: