हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

తమిళనాడులో దంచి కొడుతున్న వర్షాలు

Sudheer
తమిళనాడులో దంచి కొడుతున్న వర్షాలు

తమిళనాడులో అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెల్లూరు, పెరంబూర్, సేలం, నామక్కల్, శివగంగ, ముదురై, దిండిగల్, తూత్తుకుడి, తెనాకాశీ, తేని జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను చేపట్టారు.

భారీ వర్షాల కారణంగా చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలదుత్తురై, పుదుకొట్టై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువరూర్, రాణిపేట్, తిరువల్లూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాల ప్రభావంతో రహదారులు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికార యంత్రాంగం ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసింది.

ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చిత్తూరు, తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు, సత్యవేడు, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నీటి ముంపు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండడంతో అధికారులు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

తిరుమల, తిరుపతి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా వర్షాల ప్రభావానికి లోనయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లతో భక్తులకు సహాయం చేస్తున్నారు. భారీ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయంలోనే బయటకు రావాలని సూచనలు జారీ చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870