हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Rajanikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ ఆందోళన ఎందుకంటే !

Sudheer
Rajanikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ ఆందోళన ఎందుకంటే !

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల యువత తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. నేటి తరం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను మరిచి, పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య లత నిర్వహించిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్, ఈ సందర్భంలో యువతలో నేటి మారుతున్న ధోరణుల గురించి తన అభిప్రాయాలను వివరించారు. మన దేశ గొప్పతనం, సంప్రదాయాల గురించి తెలియని తరం పెరుగుతుండటం ఆవేదన కలిగిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో లత చేపట్టిన కార్యక్రమం ద్వారా ప్రజల్లో సంస్కృతిపై అవగాహన పెంచాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

సంప్రదాయాలు మరుగున పడుతున్నాయి

ఇక మొబైల్ యుగంలో మన సంస్కృతికి చెందిన విలువలు, సంప్రదాయాలు మరుగున పడుతున్నాయని ఆయన అన్నారు. యువతతో పాటు కొందరు పెద్దలు కూడా భారతదేశపు ఘనమైన వారసత్వాన్ని గుర్తించడంలో వెనకపడుతున్నారని విమర్శించారు. పాశ్చాత్య పోకడల వైపు మక్కువ చూపడం వల్ల మన మూలాలను మర్చిపోతున్నామన్న రజనీ, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం అనే విషయాలపై అవగాహన ఉండాలి అని హితవు పలికారు. భారతీయ సంస్కృతిలో ఉన్న మానవీయ విలువలు, కుటుంబ బంధాలు, ఆధ్యాత్మికత వంటి అంశాలు మన జీవితాలను శాశ్వతంగా ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడ్డారు.

భారతీయ సంస్కృతి వైపు మొగ్గు

అంతేకాదు, విదేశీయులు సైతం శాంతి, సంతోషం కోసం భారతీయ సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. యోగా, ధ్యానం వంటి ప్రాచీన భారతీయ విద్యల ద్వారా వారు మానసిక ప్రశాంతతను పొందుతున్నారని రజనీకాంత్ వివరించారు. మరోవైపు, ఆయన నటిస్తున్న తాజా చిత్రం కూలీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో యాక్షన్ ప్రధాన కథ కొనసాగనుంది. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ వంటి ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.

Read Also : J&Kలో ఐదుగురు చొరబాటుదారుల హతం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870