हिन्दी | Epaper

Latest Telugu News: Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Vanipushpa
Latest Telugu News: Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

భారత స్టాక్ మార్కెట్లు(Stock Market) వరుసగా ఆరో రోజూ లాభాల బాటలో పయనించాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు గురువారం కూడా లాభాలతో ముగిశాయి. అయితే, ట్రేడింగ్ చివరి గంటల్లో లాభాల స్వీకరణ జరగడంతో ఇంట్రాడే గరిష్ఠాల నుంచి కిందకు జారాయి. ట్రేడింగ్ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 864 పాయింట్ల వరకు లాభపడి 85,290 వద్ద కొత్త 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. కానీ చివరికి 130 పాయింట్ల స్వల్ప లాభంతో 84,556 వద్ద ముగిసింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 26,104 స్థాయికి చేరినప్పటికీ, చివరకు కేవలం 23 పాయింట్ల లాభంతో 25,891 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది.

Read Also: G alert: UCO బ్యాంక్‌లో ఉద్యోగాల జాతర

Stock Market
Stock Market

భారత్-అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం

ఐటీ రంగ షేర్లు ఈ ర్యాలీని ముందుండి నడిపించాయి. ఇన్ఫోసిస్ ప్రమోటర్లు రూ.18,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌లో పాల్గొనబోమని ప్రకటించడంతో ఆ సంస్థ షేరు ఏకంగా 4 శాతం పెరిగింది. దీనికి తోడు, భారత్-అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న వార్తల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ షేర్లు కూడా రెండు శాతానికి పైగా లాభపడ్డాయి.

లాభపడిన షేర్లలో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్..

ఇతర లాభపడిన షేర్లలో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, టాటా మోటార్స్ ఒక శాతానికి పైగా వృద్ధి చెందాయి. మరోవైపు, ఎటర్నల్ 3 శాతంతో టాప్ లూజర్‌గా నిలవగా, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు 1 నుంచి 2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే, బ్రాడర్ మార్కెట్‌లో సెంటిమెంట్ బలహీనంగానే ఉంది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ నివేదిక

ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ నివేదిక

పితృత్వ సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

పితృత్వ సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

విజయ్ పార్టీ పొత్తులపై కీలక నిర్ణయం?

విజయ్ పార్టీ పొత్తులపై కీలక నిర్ణయం?

విమాన ప్రయాణీకులు ఇకపై దానికి ఎక్స్ ట్రా ఛార్జీ అవసరం లేదు!

విమాన ప్రయాణీకులు ఇకపై దానికి ఎక్స్ ట్రా ఛార్జీ అవసరం లేదు!

ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ బిజీ.. రాహుల్ గాంధీతో కీలక భేటీ!

ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ బిజీ.. రాహుల్ గాంధీతో కీలక భేటీ!

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం!

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం!

ఉజ్వల పథకం ఎఫెక్ట్.. రికార్డు స్థాయికి పెరిగిన LPG వినియోగం

ఉజ్వల పథకం ఎఫెక్ట్.. రికార్డు స్థాయికి పెరిగిన LPG వినియోగం

9వ తరగతి సిలబస్ మార్పుపై సలహాలు, సూచనలు చేయండి

9వ తరగతి సిలబస్ మార్పుపై సలహాలు, సూచనలు చేయండి

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కోసం తండ్రిని బస్తాలో కుక్కిన కూతురు
0:56

ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కోసం తండ్రిని బస్తాలో కుక్కిన కూతురు

11 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి!

11 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి!

ఈ యేడాది అనావృష్టి ఎల్నినోతో నైరుతిపై ప్రతికూలం

ఈ యేడాది అనావృష్టి ఎల్నినోతో నైరుతిపై ప్రతికూలం

📢 For Advertisement Booking: 98481 12870