కర్ణాటక రాజకీయాల్లో ఇటీవలే కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు (Siddaramaiah) హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన “అవినీతి రేటుకార్డు (Corruption Rate Card)” ప్రకటన నేపథ్యంలో, బీజేపీ పరువునష్టం కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తో పాటు రాహుల్ గాంధీ, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్లను కూడా చేర్చారు.

కేసు నేపథ్యం:
2023 ఎన్నికల సమయంలో (elections time) కాంగ్రెస్ పార్టీ ఒక వివాదాస్పద ప్రకటన విడుదల చేసింది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంలో పదవులు, కాంట్రాక్టులకు లంచాల రేట్లను నిర్ణయించిందని ఆరోపించింది. ఈ ప్రకటన ద్వారా తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ బీజేపీ పరువునష్టం దావా వేసింది. ఉదాహరణకు, “కాంట్రాక్ట్ కొరకు 40% కమీషన్”, “బదిలీకి రూ. 10 లక్షలు”, వంటి వివరాలతో తయారుచేసిన ప్రకటన ప్రజల్లో దూసుకుపోయింది. దీనిని ‘అవినీతి రేటు కార్డు’గా అభివర్ణిస్తూ ప్రచారం సాగింది.
హైకోర్టు తీర్పు:
ఈ కేసులో కర్ణాటక హైకోర్టు తాజా విచారణలో, పరువునష్టం కేసును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసును ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేయడంతో కాంగ్రెస్ నేతలకు భారీ ఊరట లభించింది .
సిద్ధరామయ్య ఎన్నిసార్లు సీఎం అయ్యారు?
2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో, సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. ఇది అతని 9వ ఎన్నికల విజయం. ఆయన రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
సిద్ధరామయ్య ఎవరు?
సిద్ధరామయ్య (పుట్టిన తేది: 3 ఆగస్టు 1947), “సిద్దూ” అనే ముద్దుపేరుతో ప్రసిద్ధుడు. ఆయన భారతీయ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర 22వ ముఖ్యమంత్రిగా 2023 మే 20 నుండి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Punjab CM: ప్రధాని మోదీపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విమర్శలు