కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్.. భారతదేశ శత్రువైన పాకిస్థాన్ను పొగుడుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. టి20 వరల్డ్ కప్లో భారత్తో ఆడే విషయంలో పాకిస్థాన్ తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాన్ని థరూర్ కొనియాడుతూ కనిపించారు. అయితే తాజాగా ఈ వీడియోపై ఆయన స్పందించారు. ఆ గొంతు, భాష నాది కాదని.. కావాలనే ఎవరో కృత్రిమ మేధ సాయంతో ఈ వీడియోను సృష్టించారని చెప్పారు. తనకు ఈ వీడియోతో ఎలాంటి సంబంధమూ లేదని.. దాన్ని తీక్షణంగా గమనిస్తే ఆ విషయం అందరికీ అర్థం అవుతుందన్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో శశి థరూర్(Shashi Tharoor) గొంతును పోలిన వాయిస్తో కొన్ని సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి.
Read Also: Jaipur: డ్రైవర్ నిర్లక్ష్యం ప్రాణం తీసింది.. అసలేం జరిగింది?

మన దేశంలోనూ ఈ వీడియో వైరల్
“పాకిస్థాన్ దౌత్యపరంగా అద్భుతమైన విజయం సాధించింది. మైదానంలో వారు ఎలా ఆడుతారో తెలియదు కానీ.. దౌత్యపరంగా మాత్రం భారత క్రికెట్ బోర్డు (BCCI)ని అడ్డంగా బుక్ చేశారు. బలహీనమైన దేశం కూడా తెలివైన దౌత్యంతో రాక్షసుడి లాంటి ప్రత్యర్థిని ఎలా ఓడించవచ్చో పాక్ నిరూపించింది” అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ముఖ్యంగా పాకిస్థానీ సోషల్ మీడియా అకౌంట్లు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ ప్రచారం చేసుకున్నాయి. దీంతో మన దేశంలోనూ ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై శశి థరూర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. “ఇది కృత్రిమ మేధతో సృష్టించిన నాణ్యత లేని ‘ఫేక్ న్యూస్’. అందులో ఉన్న భాష కానీ.. వాయిస్ కానీ నావి కావు” అని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: